Sreeleela: ఆ మహానగరంలో బోయపాటిరాపో లాస్ట్ షెడ్యూల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీ లో ఎవరూ ఊహించని కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పటినుంచే సోషల్ మీడియాలో అంచనాలు పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన బోయపాటిరాపో ఫస్ట్ థండర్ గ్లిమ్ప్స్ సినిమాపై ఉన్న అంచనాలని రెట్టింపు చేసింది. మామూలుగా బోయపాటి సినిమాలన్నీ ఊరమాస్ గా ఉండడం సహజం. తన హీరోలు కూడా అంతే మాస్ గా రగ్డ్ లుక్ తో ఉంటారు. అయితే రామ్ లాంటి చాకోలెట్ బాయ్ ని కూడా బోయ ఇంత మాస్ గా చుపిస్తాడనుకోలేదు.

సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోయింది. అయితే ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కానీ ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ కర్ణాటక లోని మైసూర్ లో జరుగనున్నట్టు చిత్ర యూనిట్ ద్వారా సమాచారం అందింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ తో పాటు శ్రీ లీల కూడా పాల్గొనబోతుంది.

తాజాగా ఈ చిత్ర యూనిట్ మైసూర్ లో ఫ్లైట్ ద్వారా ల్యాండ్ అయినట్టు శ్రీ లీల ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోస్ ద్వారా తెలిసింది. ఈ షెడ్యూల్ ని జూన్15 వరకు దాదాపు 10రోజుల పాటు జరుపనున్నారు. ఇక్కడే హీరో హీరోయిన్ల మధ్య ఓ పాటను కూడా షూట్ చేయబోతున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా దసరా కానుక గా అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు