Bedurulanka pre release event: కార్తికేయ నాకు ముందే తెలుసు – నేహా శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

Bedurulanka pre release event

టిల్లు బ్యూటీ నేహా శెట్టి హీరో కార్తికేయపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కార్తికేయ, నేహా శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా బెదురులంక ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా, ఆ ఈవెంట్ లో హీరోయిన్ నేహా శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి.

డీజే టిల్లు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నేహా శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న నేహా శెట్టి ఈ వారం ఆగస్ట్ 25న బెదురులంక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ.. ఎట్టకేలకు రిలీజవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండగా నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు మూవీ యూనిట్. ఇక ఈ ఈవెంట్ లో నేహా శెట్టి మాట్లాడుతూ బెదురులంక సినిమా చూసాక.. డీజే టిల్లు రాధికా మర్చిపోతారంటూ చెప్పుకొచ్చింది. డీజే టిల్లు సినిమా రిలీజ్ అయినపుడు తాను కొన్ని కారణాల ఆ సినిమా ఈవెంట్స్ కు హాజరవలేకపోయాను, అందుకే ఈ స్టేజి పైన మీ అందరికి ఆ సినిమా మంచి హిట్ చేసినందుకు చాలా థాంక్స్ అంటూ చెప్పింది. బెదురులంక సినిమా రిలీజ్ పై తాను చాలా ఎగ్జైట్ గా ఉన్నానని తెలిపింది.

- Advertisement -

అలాగే హీరో కార్తికేయ గురించి మాట్లాడుతూ నేను ఆర్ఎక్స్ 100 సినిమాకి నా ఫ్రెండ్స్ తో వెళ్లి చూసాను.. ఆ సినిమాలో కార్తికేయ పర్ఫామెన్స్ చూసి ఆ సినిమాకు ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు కార్తికేయ తో బెదురులంక సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉందని ఆమె చెప్పింది. అలాగే తనని నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ లకు థాంక్స్ చెప్పి ఆమె స్పీచ్ ను ముగించింది. కాగా ప్రస్తుతం కార్తికేయ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరియు తెలంగాణ కి రాధికా, ఆంధ్ర కి చిత్ర అంటూ నేహా శెట్టి చెప్పిన డైలాగ్ లు ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు