Anasuya : ఆ ఉసురు ఊరికే పోదు

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం గురువారం థియేటర్ లోకి వచ్చింది. అంచనాలు అందుకోలేదని, సినిమా భారీ డిజాస్టార్ అవుతుందని సినీ లవర్స్ రివ్యూ ఇస్తున్నారు. సినీ క్రిటిక్స్ నుండి కూడా లైగర్ కు నెగిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ట్విట్టర్ లో బుల్లి తెర యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ కొన్ని సార్లు రావడం లేటు అవ్వచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’ అనే ట్వీట్ చేసింది యాంకర్ అనసూయ. అలాగే తాను ఇతరుల బాధను చూసి ఆనందపడనని, కానీ, కర్మ అనేది తిరిగి వస్తుంది అనే అర్థం వచ్చేలా ఒక ట్యాగ్ ను కూడా పెట్టింది. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రంగమత్తపై ఫైర్ అవుతున్నారు.

లైగర్ గురించే అనసూయ ఈ ట్వీట్ చేసిందని అంటున్నారు. సినీ పరిశ్రమలో గెలుపు ఓటములు సహజమని, అది అనసూయ తెలుసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం జరిగిన అంశం గురించి ఇప్పుడు తీసుకురావడం సరికాదని అంటున్నారు. కాగా అర్జున్ రెడ్డి సినిమాలో తల్లి గురించి ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని ఆ సమయంలో అనసూయ తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పుడు రౌడీ హీరో అభిమానులకు అనసూయ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వివాదమే జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు