Allu Arjun Statue : బన్నీకి అరుదైన ఘనత.. మైనపు విగ్రహం ఆవిష్కరణ..!

Allu Arjun Statue : టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవల్లో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.. దీంతో అల్లు అర్జున్ ప్రపంచ ప్రఖ్యాతి మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియంలో తన విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసినటువంటి ఒక అరుదైన గౌరవాన్ని కూడా అల్లు అర్జున్ దక్కించుకున్నారు.. ఈ మైనపు విగ్రహం కోసం అల్లు అర్జున్ కొలతలు గత ఏడాది అక్టోబర్ నెలలో తీసుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఈ విగ్రహం ఓపెనింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

మైనపు విగ్రహం ఆవిష్కరణ..

ఇప్పుడు తాజాగా ఆ విగ్రహం ఓపెనింగ్ డేట్ అండ్ టైం అనౌన్స్మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయబోతున్నారట. ఈ ఓపెనింగ్ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ కి వెళ్ళబోతున్నట్లు సమాచారం. మార్చి 28 న రాత్రి 8 గంటలకు ఈ విగ్రహావిష్కరణ జరగబోతోంది. ఈ న్యూస్ ని దుబాయ్ టుస్పాడ్స్ మ్యూజియం నిర్వహకులే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు అర్జున్ కూడా ఈ పోస్టుని రీషేర్ చేస్తూ తన అభిమానుల కోసం వెల్లడించారు.

విగ్రహం లుక్..

allu arjun statue in madame tussauds
allu arjun statue in madame tussauds

అయితే అభిమానులు అందరూ కూడా ఈ విగ్రహం ఎలా ఉండబోతోంది అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తీసుకువచ్చిన పుష్ప గెటప్ లో ఉండబోతోందా అంటూ అందరు అంచనాలు వేస్తున్నప్పటికీ అయితే అక్కడ విగ్రహం పుష్ప మరియు అలా వైకుంఠపురంలోని సినిమాలలోని పాత్రలను మిక్స్ చేసినట్టుగా సమాచారం.. పుష్ప మేనరిజం తగ్గేదేలే స్టైల్ లో ఉండడమే కాకుండా రెడ్ జాకెట్ తో ఉన్నటువంటి అల్లు అర్జున్ విగ్రహాన్ని కూడా ప్రదర్శించబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియం..

అయితే ఇప్పటివరకు మన తెలుగు హీరోలు మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియంలో మహేష్ , ప్రభాస్ మైనపు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి.. అయితే ఆ రెండు మైనపు బొమ్మలు లండన్ లోని మ్యూజియంలో ఉంచారు.. ఇప్పుడు అల్లు అర్జున్ ది దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.. మొదటి ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ కావడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప -2 చిత్రంలో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ ఎంతో పగడ్బందీగా చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు చిత్ర బృందం.

అల్లు అర్జున్ చిత్రాలు..

అల్లు అర్జున్ చిత్రాల విషయానికి వస్తే.. పుష్ప -2 సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు..మోత్తానికైతే జాతీయ నటుడిగా పేరు తెచ్చుకొని.. ఇప్పుడు మేడమ్ టుస్పాడ్స్ లో మైనపు విగ్రహం ప్రదర్శించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు