Adavi Sesh : సీక్వెల్ పై ఫుల్ ఫోకస్

హిట్-2 తో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన శేష్ ప్రస్తుతం తెలుగులో బ్లాక్ బస్టర్ హీరోగా కొనసాగుతున్నాడు. క్షణం, అమీతుమీ, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్2 లాంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను తన ఖాతలో వేసుకున్నాడు. తనకు తానే కథలు రాసుకొని వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకు పోతున్న ఈ కుర్ర హీరో తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి మళ్ళీ సిద్ధం అవుతున్నాడు.

అడివి శేష్ ఇప్పుడు తన ఫోకస్ అంత గూఢచారి-2  పైకి షిఫ్ట్ చేసాడు. ఈ సినిమా గూఢచారికి సీక్వెల్ గా రాబోతుంది. 2018 లో రిలీజ్ అయిన గూఢచారి అప్పట్లో సంచలన విజయం సాధించింది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఈ సినిమాకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టీఆర్పీను సంపాదించుకుంటుంది.

దీనికి సీక్వెల్ గా వస్తున్న గూఢచారి2కి అడవి శేష్ కథ సిద్ధం చేస్తున్నాడన్న టాక్ వచ్చినప్పటి నుంచి భారీ స్థాయిలో అంచనాలు పెరిగి పోతున్నాయి. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. శశి కిరణ్ ఇదివరకే గూఢచారి మొదటి పార్ట్ తో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. ఆయనే సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అడివి శేష్ మేజర్ సక్సెస్ మీట్ లో గూఢచారి 2 భారీ స్థాయిలో ఉండబోతున్నట్టు చెప్పాడు.

- Advertisement -

అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా మొదటి భాగాన్ని నిర్మించారు. గూఢచారి 2ను ఈ సారి కొత్త ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఏది ఎంత మాత్రం నిజమో.. ఆ కొత్త ప్రొడ్యూసర్ ఎవరో తెలియాలంటే ఇంకొంత కలం వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు