Sai dharam tej: డబ్బుల్లేవు.. నెంబర్ లేదు.. పైగా టార్చర్ – అబ్దుల్

జ్మెగా మేనల్లుడు సాయి ధరమ్ తే ప్రస్తుతం విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంతోషంలో ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిలర్ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను అందుకుని లాభాల బాటపడుతుంది. ఫుల్ రన్ ముగిసే సరికి రికార్డ్ స్థాయిలో లాభాలు రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా, సాయి ధరమ్ తేజ్ కి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు చావు వరకు వెళ్లి వచ్చిన ఈ యంగ్ హీరో, ప్రస్తుతం అయితే ఆరోగ్యంగానే ఉన్నాడు.

కాగా, సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో, ఆయనను గుర్తించి, ఆస్పత్రికి తీసుకెళ్లిన అబ్దులు ఫర్హాన్ మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. సాయిని కాపాడంటంతో మెగా ఫ్యామిలీ భారీ స్థాయిలో సాయం చేశారని వార్తలు వచ్చాయి. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అబ్దులుకు తాను డబ్బులు అయితే ఇవ్వలేను కానీ, నా ఫోన్ నెంబర్ ఇచ్చి, ఎప్పుడు సాయం కావాలన్నా.. ఫోన్ చేయమన్నాను అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. దీనిపై అబ్దుల్ స్పందించాడు.

ఇప్పటి వరకు తనకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని అన్నాడు. అంతే కాదు.. సాయి ధరమ్ తేజ్ కూడా తనకు నెంబర్ ఇవ్వలేని చెప్పుకొచ్చాడు. అంతే కాదు.. మెగా ఫ్యామిలీ తనకు భారీగా డబ్బు ఇచ్చారు అంటూ వార్తలు రావడంతో బంధువులు, కొలీగ్స్ నుంచి టార్చర్ వచ్చిందని అన్నాడు. అందుకే చేస్తున్న చిన్న ఉద్యోగాన్ని కూడా మానేయాల్సి వచ్చిందంటూ వాపోయాడు. “నా గురించి ఇంకా ఫేక్ ప్రచారం జరుగుతుంది. “నాకు ఎలాంటి సాయం రాలేదు. ఎవరూ నెంబర్ ఇవ్వలేదు. దయచేసి నాపై వస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఆపేయండి” అంటూ అబ్దులు మీడియాని వేడుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు