Vijay-Samantha: అంబటి రాంబాబు ఖుషి సినిమా రివ్యూ ?

Vijay-Samantha

సినిమా స్టార్స్ కు రాజకీయ నాయకులకు ఎడతెగని అనుబంధం ఉంటుందనేది అందరికి తెలిసిందే. అయితే ఈ అనుబంధానికి కారణం సినిమాలలో రాణించిన వారు రాజకీయాల్లోకి రావడమే సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి మొదలు పెడితే నేడు పవన్ కళ్యాణ్ వరకు ఇదే పోకడ కొండసాగుతూ వస్తుంది. అయితే ఈ విషయం కాస్త పక్కన పెడితే ఇటీవలనే కొంతమంది రాజకీయ నాయకులు సినిమాల రివ్యూలు కూడా ఇస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఇటీవలనే విడుదలైన విషయం అందరికి తెలిసిందే. యాక్టర్ కం డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ బ్రో సినిమా జులై 28న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచి 30 కోట్ల లాస్ తో థియేటర్ రన్ ముగించుకుంది. అయితే ఇప్పుడు ఈ బ్రో సినిమా గురించి ఎందుకు అంటారా.. ఇక అసలు విషయంలోకి రావాల్సిందే. అదేంటంటే బ్రో సినిమాలో యాక్టర్ పృథ్వీ రాజ్ పోషించిన శ్యామ్ బాబు అనే పాత్ర ఇటీవల కాలంలో కాంట్రావర్సీ కి తెర తీసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబు ఒరిజినల్ క్యారెక్టర్ నే ఈ సినిమాలో పెట్టారని వివాదాస్పదం అయింది. దాంతో అంబటి రాంబాబు బ్రో సినిమా చూసి.. తన పాత్రను సినిమాలో పెట్టినందుకు ప్రెస్ మీట్ పెట్టి మరి బ్రో సినిమా రివ్యూను ఇచ్చాడు.

ఇక దాంతో.. రాజకీయాల్లో విమర్శలు సహజం.. అయిన ప్రజాసేవ చెయ్యాల్సిన నాయకులు సినిమాల రివ్యూలు చెప్పడమేంటని సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కు కూడా గురయ్యాడు అంబటి రాంబాబు. ఇక లేటెస్ట్ గా చూస్తే విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా రిలీజై, థియేటర్స్ ప్రదర్శింపబడుతుండగా అంబటి రాంబాబు ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ రివ్యూ ఇవ్వండని సరదా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా టీజర్ ను కూడా బ్రేక్ డౌన్ చేసి హిడెన్ డీటేల్స్ చెప్పవలసిందిగా అంబటి రాంబాబును ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు, మరి దీనిపై అంబటి రాంబాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు