సినిమా ప్రమోషన్స్ లో రోజురోజుకీ కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ప్రమోషన్స్ అంటేవాల్ పోస్టర్స్, ఆడియో ఫంక్షన్స్ మాత్రమే అన్నట్టు ఉండేది కానీ, డిజిటల్ మేనియా స్టార్ట్ అయ్యాక సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ మధ్య ప్రతి అప్డేట్ కి ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు మేకర్స్.
సినిమా రిలీజ్ వారం రోజుల లోపు ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయటం ఇప్పుడు అంతా ఫాలో అవుతున్న ట్రెండ్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కే ప్రీరిలీజ్ అని పేరు మార్చినట్టు మ్యూజికల్ కాన్సర్ట్ అనే పేరుతో కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తుంటారు. ఇటీవల విజయ్, సమంతలు నటించిన ఖుషి సినిమాకి కూడా మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ కండక్ట్ చేశారు.
ఈ ఈవెంట్ లో సమంత, విజయ్ ల లైవ్ పర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. మరో హీరో విశ్వక్ సేన్ కూడా హీరోయిన్ నేహశెట్టితో కలిసి చేసిన లైవ్ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వక్ సేన్, నేహశెట్టి కలిసి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని సాంగ్ లాంచ్ ప్రోగ్రాం లో ఇద్దరు కలిసి స్టెప్స్ వేయటం హైలైట్ గా నిలిచింది.
ఒకప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంటే హీరోల స్పీచ్ కోసం ఎదురు చూసేవారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు చూస్తుంటే ట్రెండ్ మారుతోందని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ కొత్త ట్రెండ్ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటంతో పాటు సినిమాకి ప్రమోషన్స్ కి మంచి బూస్టప్ ఇస్తోందని చెప్పాలి. మరి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ ట్రెండ్ ఇంకెంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News