సినీ ప్రముఖుల, రాజకీయ నాయకుల జాతకాలను తెలియజేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. అయితే మొదట్లో వేణు స్వామి జ్యోతిష్యం చెప్పినప్పుడు కేవలం పాపులారిటీ కోసమే చెపుతున్నాడని చాలామంది అనుకున్నారు. అంతేకాకుండా వేణు స్వామిని చాలామంది దారుణంగా ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వేణు స్వామి చెప్పినటువంటి కొంతమంది సెలబ్రిటీలు జాతకాలు నిజం అవుతూ ఉండడంతో ఈయనని నమ్మడం మొదలుపెట్టారు. దీంతో చాలామంది హీరోయిన్స్ కూడా వేణు స్వామితో పూజలు చేయించుకుని మరీ స్టార్డమ్ ని అందుకున్నారు.
నిజమైన వేణు స్వామి జోతిష్యం..
ముఖ్యంగా బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరుపొందిన టాలీవుడ్ జంట సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే అది నిజం అవడంతో ఒక్కసారిగా వేణు స్వామి చెప్పిన విషయాల పైన చాలామందికి నమ్మకం కలిగింది. ముఖ్యంగా రష్మిక ఎంగేజ్మెంట్ తర్వాత వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవడంలో కూడా వేణు స్వామి హస్తం ఉంది. అంతేకాదు రష్మిక నేషనల్ క్రష్ గా మారడం వెనుక వేణు స్వామి చేసిన పూజలు ఉన్నాయని అని కూడా అంటారు. ఇది తెలిసి అదే బాటలో చాలా మంది హీరోయిన్స్ సైతం వేణు స్వామి తో పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వేణు స్వామి జ్యోతిష్యం సినిమాల వరకే కాదు రాజకీయ నాయకుల వరకు కూడా పాకిపోయింది. ఇక రాజకీయ నాయకుల విషయంలో కూడా అటు ఇటుగా వేణు స్వామి చెప్పిన ఎన్నో విషయాలు నిజమవుతున్నాయి.
మహేష్ – రాజమౌళి మూవీ పై వేణు స్వామి కామెంట్స్..
అయితే ఇప్పుడు తాజాగా రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా పై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ SSMB-29 సినిమా పైన ఎక్కువ దృష్టి పెట్టారు.. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ ప్రాజెక్టు ను రూ .1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఇప్పుడు ఇదే విషయంపైన వేణు స్వామి స్పందిస్తూ.. మహేష్ బాబుకు అంత స్టామినా లేదంటూ తెలియజేశారు. మహేష్ – రాజమౌళి కాంబినేషన్లో రూ.1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు.. మహేష్ బాబు మీద అంత బడ్జెట్ పెట్టడం వ్యర్థం అంటూ కామెంట్స్ చేశాడు.
మహేష్ బాబుకి అంత సీన్ లేదు..
మహేష్ బాబు మీద అంత బడ్జెట్ పెట్టడం అనవసరమని, టికెట్లు రేట్లు పెంచినప్పటికీ ఆయన సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాలంటే నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. అలాంటప్పుడు అన్ని కోట్ల రూపాయలు ఎలా కలెక్ట్ చేస్తుంది అంటూ వేణు స్వామి చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారడంతో ఈ విషయం పైన మహేష్ ఫ్యాన్స్ వేణు స్వామిని ఏకీపారేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాకముందే ఇలాంటి రూమర్స్ సృష్టించకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc