Vyra Entertainments : కంచె లాంటి కథతో మరోసారి వరుణ్ తేజ్

స్టార్డం తో సంబంధం లేకుండ విభిన్న పాత్రలు పోషిస్తూ.. విలక్షణ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ బిగినింగ్ నుంచే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న వరుణ్ తేజ్, ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాండీవధారి అర్జున సినిమాతో పాటు శక్తి ప్రతాప్ సింగ్ అనే బాలీవుడ్ దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు కాగా ఈ సినిమాల షూటింగ్ దాదాపు పూర్తవడంతో ఆయన ఇటీవలనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వరుణ్ తేజ్ కెరీర్ లో ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచిన కంచె సినిమా గురించి అందరికి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ తేజ్ నటనకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల వరకు అందరు ఆయన నటనను ప్రశంసించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మరోసారి అలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1960 స్ నేపథ్యంలో జరిగే ఒక కొత్త కథ, కథనంతో వరుణ్ తేజ్ హీరోగా వైరా క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఒక సినిమా నిర్మించబోతున్నారు

పలాస సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు . గత కొద్దీ కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, రీసెంట్ గానే స్క్రిప్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఈ నెల 27న లాంఛనంగా ప్రారంభించి, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చూస్తున్నట్టు సమాచారం.  ఇక వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో మొదటిసారిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు