Dilraju: ఒకే ఇంటర్వ్యూలో టాలీవుడ్ బడా నిర్మాతల చిట్ చాట్..!

టాలీవుడ్ లో రాబోయే సంక్రాంతి కి ఐదు కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. థియేటర్ల సమస్య వస్తుందని తెలిసినా ఏ నిర్మాత కూడా వెనక్కి తగ్గడం లేదు. పైగా ప్రమోషన్లలో కూడా మూవీ మేకర్స్ ఎవరికీ వారు తగ్గకుండా జోరుగా తమ సినిమాలను ప్రచారం చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే సంక్రాంతి సినిమాల విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ దిల్ రాజు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా పొంగల్ కి రాబోయే సినిమాల బడా నిర్మాతలు ఈ సినిమాల కోసం, ఇంకా టాలీవుడ్ లో రాబోతున్న సినిమాల కోసం ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న నలుగురు బడా నిర్మాతలు పాల్గొనడం విశేషం. బహుశా ఈ నలుగురు ప్రొడ్యూసర్లు ఒకే ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఆ నలుగురు ఎవరంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ ఓనర్ నాగ వంశి, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్స్ మీడియా నిర్మాతల్లో ఒకరైన విశ్వ ప్రసాద్.

ఇక వీళ్ళలో విశ్వ ప్రసాద్ ఈగల్ సినిమా నిర్మించగా, దిల్ రాజు గుంటూరు కారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇక నాగ వంశి, నవీన్ యెర్నేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2024 లో వచ్చే పదికి పైగా బడా సినిమాలను నిర్మిస్తుంది వీళ్ళే. ఇక తాజాగా ఈ నిర్మాతలు పాల్గొన్న ఇంటర్వ్యూ లో 2023 లో వచ్చిన సినిమాల మొదలుకొని 2024 లో వచ్చే సినిమాల గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే అందులో ఎక్కువగా సంక్రాంతి కి రాబోయే సినిమాలతో పాటు సమ్మర్ లో వచ్చే బడా సినిమాల గురించి మాట్లాడారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు