TilluSquare : క్లైమాక్స్ ని అలా ప్లాన్ చేసిన సిద్ధూ?

టాలీవుడ్ లో ఈ నెలలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రం ఏదైనా ఉందంటే అది “టిల్లు స్క్వేర్” అని చెప్పాలి. మిగతా సినిమాలు కంటే ఈ సినిమాకి ప్రత్యేకమైన హైప్ ఉంది. రెండేళ్ల కింద వచ్చిన డీజే టిల్లు చిన్న సినిమాగా రిలీజ్ అయి ఊహించని విధంగా మాస్ ఆడియన్స్ సపోర్ట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయిన సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అలాంటి స్టార్ డమ్ తెచ్చిన సినిమా సీక్వెల్ తో మళ్ళీ వస్తున్నారంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ గాని ట్రైలర్ గాని ఓ రేంజ్ ఇంపాక్ట్ న క్రియేట్ చేసాయి. ఇటు నిర్మాత నాగవంశీ కూడా టిల్లు స్క్వేర్ కి ఎక్కడా తగ్గకుండా భారీగా ఖర్చుపెడుతున్నటు సమాచారం. అప్పట్లో డీజే టిల్లు నిర్మాతకు కాసుల వర్షం కురిపించి పెట్టుబడికి మూడు రేట్లు లాభాల్ని అందించింది. ఇక ఇప్పుడు టాక్ తో సంబంధం లేకుండా మూవీ బిజినెస్ మొత్తాన్ని వారాంతంలోనే వెనక్కి తెచ్చే రేంజ్ లో ఓపెనింగ్స్ ఉండాలని నాగ వంశి ప్లాన్ చేస్తున్నారట.

మళ్లీ స్క్రిప్ట్‌లో మార్పులు… 

టిల్లు స్క్వేర్ ఫస్ట్ పార్ట్ ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఫస్ట్ పార్ట్ కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా, సెకండ్ పార్ట్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకి కథ రాసింది మాత్రం సిద్ధూ జొన్నలగడ్డనే. అయితే సినిమాలో కాస్త స్క్రిప్ట్ డెవలప్మెంట్ కోసం చర్చ జరుగుతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో రాధికా ఎంట్రీ కోసం కాస్త స్క్రిప్ట్ ఛేంజ్ చేసారని ఆ ఆమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ అంటే రిలీజ్ దగ్గరవుతున్న టైం లో అవసరమా అని నెటిజన్లు అంటున్నా, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చిన్న పాటి మార్పే అని, అది స్క్రిప్ట్ ని చెడగొట్టేవిధంగా మాత్రం ఉండదని సమాచారం.

- Advertisement -

క్లైమాక్స్ ఈ సారి డిఫరెంట్‌గా…

ఇక మేకర్స్ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం టిల్లు స్క్వేర్ లాస్ట్ షెడ్యూలు చిత్రీకరణలో ఉంది. ఈ షూటింగ్ కాకినాడ లో ఆల్రెడీ ప్రారంభమయిందని సమాచారం. కాకినాడ పోర్ట్ లో క్లైమాక్స్ కు సంబంధించిన మ్యాచింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఇక ఇక్కడే కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. దాదాపు ఆరు రోజుల పాటు కాకినాడలోని షూటింగ్ ఉంటుందని సమాచారం. అయితే ఫస్ట్ పార్ట్ లో డీజే టిల్లు తో ఫైట్ సీన్లు ఏమి ఉండవు. కానీ సీక్వెల్‌ని మాస్ స్టఫ్ తో ప్లాన్ చేసారని వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఒక యాక్షన్ సినిమా మాదిరి ఫైట్స్ కాకుండా ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే కాస్త కొత్తగా ఉంటాయట. పైగా క్లైమాక్స్ లో డీజే టిల్లు రాధికా ని దించబోతున్నారని సమాచారం.

ఇదే నిజమైతే టిల్లు ఫాన్స్ కి క్లైమాక్స్ ఓ మంచి కిక్కిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే కూడా ఫస్ట్ పార్ట్ కి డబుల్ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని అనిపిస్తుంది. మరి టిల్లు స్క్వేర్ థియేటర్లలో ఏ రేంజ్ లో మోత మోగిస్తాడో చూడాలి. ఇక టిల్లు స్క్వేర్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించగా, రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు. బీజీఎమ్ థమన్ అందించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫైనల్ గా మార్చ్ 29న థియేటర్ల దగ్గర థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు