Guntur Kaaram: “ఓ మై బేబీ” డ్యామేజ్ కంట్రోల్ కోసం శ్రీలీలను వాడేస్తున్నారే!?

“గుంటూరు కారం” టీం డామేజ్ కంట్రోల్ ను స్టార్ట్ చేసింది. దానికోసం ఏకంగా హీరోయిన్ శ్రీలీలనే వాడేసుకుంటున్నారు. “ఓ మై బేబీ” ఇప్పటికైనా పుంజుకుంటుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. చిత్ర బృందం ప్రమోషన్స్ లో దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ “దమ్ మసాలా” సినిమాపై హైప్ ని అమాంతం పెంచేసింది. ఇక తాజాగా “ఓ మై బేబీ” అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ విషయంలో మాత్రం వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఈ సాంగ్ రిలీజ్ కాకముందు ప్రేక్షకులలో ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ లో “ఓ మై బేబీ” సాంగ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. కానీ ఆ సాంగ్ రిలీజ్ కాగానే ఒక్కసారిగా ఆ అంచనాలు నీరుగారిపోయాయి. సాంగ్ ట్యూన్స్ అసలేం బాగా లేవని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై, లిరిక్స్ చండాలంగా ఉన్నాయంటూ రామ జోగయ్య శాస్త్రిపై, అలాగే ఇంత నాశిరకమైన పాటలను ఎలా యాక్సెప్ట్ చేశారంటూ దర్శకుడు త్రివిక్రమ్ పై మహేష్ ఫ్యాన్స్ మండిపడ్డారు.

దీంతో సోషల్ మీడియాలోని ఏ ప్లాట్ ఫామ్ లో చూసినా “ఓ మై బేబీ” పాటపై ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆ పాట రచయిత రామ జోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ ట్రోలింగ్ బ్యాచ్ ను కుక్కలతో పోలుస్తూ నోరు జారాడు. మహేష్ అభిమానులు అని కూడా చూడకుండా ఆయన అంతలా ఫైర్ కావడంతో వీళ్ళకి కూడా బాగానే కాలింది. దీంతో ఈ అసంతృప్తి కాస్తా వివాదంగా మారింది. దీంతో “గుంటూరు కారం” టీంకు అనుకున్నదొకటి అయినది ఒక్కటి అన్నట్టుగా మారింది పరిస్థితి. అసలే ఈ సాంగ్ విషయంలో అంచనాలను అందుకోలేకపోయామని తలలు పట్టుకుంటే ఈ వివాదం కూడా వాళ్ల మెడకే చుట్టుకుంది. అందుకే ఇప్పటిదాకా జరిగింది చాలు ఈ వివాదం విషయంలో అనవసరంగా నోరు జారకుండా డామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు మేకర్స్.

- Advertisement -

అందులో భాగంగానే హీరోయిన్ శ్రీలీలతో ఈ పాటకు స్టెప్పులు వేయించారు. శ్రీ లీల “ఓ మై బేబీ” సాంగ్ కు డాన్స్ వేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలలో పలు ప్రమోషనల్ స్ట్రాటజీలను ఉపయోగిస్తున్నారు. ఈ సాంగ్ పై రియాక్షన్స్ వంటి వీడియోలను పోస్ట్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇప్పటికైతే ఈ వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. శ్రీలీల డాన్స్ వీడియో మహేష్ ఫ్యాన్స్ ఆవేశాన్ని చల్లబరిచినట్టుగా ఉంది. ఇప్పటికైతే మహేష్ ఫ్యాన్స్ సైలెంట్ గానే ఉన్నారు. కానీ నెక్స్ట్ సాంగ్ విషయంలో కూడా ఇలాగే జరిగిందంటే వాళ్ళ ఆగ్రహావేశాలను తట్టుకోవడం ఎవరి వల్ల కాదేమో. ఇక ఇంత జరిగాక “గుంటూరు కారం” టీం నెక్స్ట్ సాంగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు