HBD Richa Gangopadhyay: స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది… ఇప్పుడు సినిమాలను వదిలేసి ఏం చేస్తుందో తెలుసా?

మిర్చి బ్యూటీ రిచా గంగోపాధ్యాయ ఇంకా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకొని, పలువురు స్టార్ హీరోలతో ఆడి పాడింది. కానీ అనూహ్యంగా సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ పుట్టినరోజు నేడు. మరి ఇప్పుడు రిచా సినిమాలను వదిలేసి ఏం చేస్తుందో తెలుసా?

రిచా ఇప్పుడేం చేస్తోందంటే?
లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రీచా గంగోపాధ్యాయ ఆ తర్వాత ప్రభాస్, రవితేజ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాలు చేసింది. అయితే మిర్చి సినిమా తీసుకొచ్చినంత క్రేజ్ ను, ఫాలోయింగ్ ఇతర సినిమాలు ఇవ్వలేకపోయాయి రీచాకు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలు మానేసి తన స్వస్థలమైన అమెరికాకు చదువు కోసం చెక్కేసింది. 2013 అక్టోబర్లో రిచా గంగోపాధ్యాయ సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఎంబీఏను పూర్తి చేయడానికి యూఎస్ఏ వెళ్లిపోయింది. అప్పటినుంచి దాదాపుగా అభిమానులకు దూరంగానే ఉంటూ వచ్చింది. 2017లో వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ అందుకుని అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో చదువు పూర్తి చేసుకుని తిరిగి సినిమాల్లోకి వస్తుందేమోనని ఆమె అభిమానులు ఎదురు చూశారు. కానీ రీచా గంగోపాధ్యాయ మాత్రం మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. చదువు పూర్తయిన మరో ఏడాది తర్వాత అంటే 2018లో తన క్లాస్మేట్ జో లంగెల్లాను ప్రేమించి, పెళ్లి చేసుకుంది రిచా. అప్పట్లో ఎవ్వరూ ఊహించని విధంగా వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రాగా, వాటిని చూసి అభిమానులు షాక్ అయ్యారు. 2019 జనవరిలో తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది రిచా. అదే ఏడాది డిసెంబర్లో అమెరికాలో తన బాయ్ ఫ్రెండ్ ను హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2021లో ఒక కొడుకు కూడా పుట్టాడు. ఎంగేజ్మెంట్ తర్వాత సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్పేసింది రిచా. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఒరెగాన్ లోని ఫోర్జ్ ల్యాండ్ లో తన ఫ్యామిలీతో సెటిల్ అయిపోయింది ఈ అమ్మడు. ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి దాదాపు పదేళ్లు గడిచిపోయింది. ఒకానొక సందర్భంలో తనకు మళ్ళీ సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది ఈ బ్యూటీ. కానీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది.

ఇండస్ట్రీని వదిలేయ్యడానికి ఇదే కారణమా?
2007లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రిచా ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించింది. 2010లో రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ లీడర్ లో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వెంకటేష్ తో నాగవల్లి, రవితేజతో మిరపకాయ్, ధనుష్, శింబు వంటి కోలీవుడ్ హీరోల సినిమాల్లో నటించింది. ఓ బెంగాలీ మూవీలోను మెరిసింది రిచా. ఆ తర్వాత మళ్లీ రవితేజతో సారొచ్చారు, ప్రభాస్ తో మిర్చి, నాగార్జునతో భాయ్ సినిమాలు చేసింది. భాయ్ మూవీ 2013లో రిలీజ్ కాదా, రీచాకు ఇదే చివరి మూవీ. ఆమె ఇండస్ట్రీని వదిలేయడానికి ఓ స్టార్ హీరోతో వివాదమే అని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఓ సినిమా చేస్తున్న సమయంలో స్టార్ హీరో క్యారవాన్లో రిచాతో అసభ్యంగా ప్రవర్తించాడట. దీంతో ఆ హీరోను చెప్పుతో కొడతానని ఈ బ్యూటీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. ఇగో దెబ్బతిన్న సదరు స్టార్ హీరో రిచా పాత ప్రైవేట్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయి అంటూ బ్లాక్ మెయిల్ చేసి ఆమెను టార్చర్ చేశాడని టాక్ నడిచింది. అంతేకాకుండా ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడట. ఆ బాధలన్నీ భరించలేకే సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడు దూరమైనట్లు అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు