Nandamuri family : మోక్షజ్ఞ కంటే ముందు నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ..!!

Nandamuri family : నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసమే ఎదురు చేస్తున్నారు.. కానీ గడిచిన కొన్నేళ్ల నుంచి ఎక్కువగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందనే వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.. కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు.. ఈ విషయంపై కూడా ఎన్నోసార్లు అటు నందమూరి అభిమానులు చాలా అసంతృప్తిని తెలియజేశారు.. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందనే ప్రచారం అయితే వినిపిస్తూనే ఉంది.. గతంలో కూడా బాలయ్య ఒకసారి తన కొడుకు ఎంట్రీ పైన కూడా మాట్లాడడం జరిగింది.

మోక్షజ్ఞ కంటే ముందే..

అయితే ఇప్పుడు తాజాగా ఫిలిం నగర్ లో ఒక వార్త వినిపిస్తోంది.. అదేమిటంటే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కంటే నందమూరి కుటుంబం ( Nandamuri family )నుంచి మరొక హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. అతను ఎవరో కాదు నందమూరి హరికృష్ణ కుమారుడు అయినటువంటి జానకిరామ్ పెద్ద కుమారుడు అన్నట్టుగా తెలుస్తోంది.. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే అతని పేరు కూడా నందమూరి తారకరామారావు కావడం గమనార్హం..

హరికృష్ణ మనవడే..

ఇప్పటికే తారక రామారావు అతనొక్కడే అనే సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా నటించారట… అయితే ఇప్పుడు తాజాగా అతడిని హీరోగా లాంచ్ చేయడానికి తమ కుటుంబం ప్రయత్నాలు చేస్తోందని అందుకు తగ్గట్టుగా డైరెక్టర్ తో కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

డైరెక్టర్ ఆయనే..

అందుకోసం డైరెక్టర్ వైవిఎస్ చౌదరిని సంప్రదించబోతున్నట్లు సమాచారం.. గతంలో మెగా హీరో సాయి ధరంతేజ్ 2015 వ సంవత్సరంలో రేయ్ సినిమాతో చాలా దారుణమైన డిజాస్టర్ ని అందుకున్నారు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. కానీ అప్పటినుంచి ఆయన ఎలాంటి సినిమాలను తెరకెక్కించకుండా కాస్త దూరంగానే ఉన్నారు.
ఇప్పుడు దాదాపుగా మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ కథ తోనే జానకిరామ్ కుమారుడిని లాంఛ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం.. ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతాన్ని కీరవాణి అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నందమూరి మోక్షజ్ఞ కంటే జానకిరామ్ కుమారుడే మొదట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

నిరాశలో బాలయ్య ఫ్యాన్స్..

ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు ఒకరకంగా సంతోషం వ్యక్తం చేస్తున్నా.. నటసింహ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేదని తెలిసి నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా బాలకృష్ణ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే తన కొడుకుని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారనే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.. మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు