సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక యువ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన ఇమేజ్ ని పక్కన పెట్టి మీడియం రేంజ్ బడ్జెట్ తో మిడిల్ ఏజ్ క్యారెక్టర్లో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చేయబోయే సినిమా అదేనని సమాచారం అందుతోంది. రచయత ప్రసన్న బెజవాడ గతంలో రావు రమేష్, శ్రీవిష్ణు కోసం సిద్ధం చేసిన కథను మెగాస్టార్ విన్నారని, ఆ కథలో రావు రమేష్ పాత్ర నచ్చటంతో తనకి తగ్గట్టు మార్పులు చేయమని చెప్పారని సమాచారం. చిరు చెప్పినట్లుగా కళ్యాణ్ కృష్ణ మార్పులు చేసాడని, ఆ కథలో రావు రమేష్ పాత్రలో చిరంజీవి, శ్రీవిష్ణు పాత్రలో సిద్దు జొన్నలగడ్డ నటించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో సిద్దు, చిరుకి కొడుకుగా కనిపించగా, త్రిష చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అంటున్నారు. ఈ సినిమా కూడా వాల్తేరు వీరయ్య లాగే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి రీఎంట్రీ ఇచ్చిన ఇన్నాళ్ళకి చిరు ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వినటానికి బాగానే ఉన్నా కానీ, చిరంజీవిని ఆ క్యారెక్టర్లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న అనుమానం అయితే కలుగుతోంది. టాలీవుడ్లో ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు వస్తున్న తరుణంలో చిరు ఇలా మీడియం రేంజ్ బడ్జెట్ తో తన ఇమేజ్ ని పక్కన పెట్టి చేస్తున్న ఈ రిస్క్ వర్కౌట్ అవుతుందా లేదా వేచి చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News