రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో ఓ సినిమా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించి 2024 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ‘కుటుంబరావ్’ అన్న టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ క్యారెక్టర్ గురించి కూడా ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, మృణాల్ ఈ సినిమాలో డైరెక్టర్ పాత్రలో నటిస్తోందట. హీరో విజయ్ అమెరికా కలలు కనే నిరుద్యోగి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
లైగర్ సినిమాతో ఘోర డిజాస్టర్ అందుకున్న విజయ్ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా పరశురామ్ తో చేయబోయే సినిమా షూటింగ్ ని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ద్వారా మరో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ అందుకోవాలని విజయ్ భావిస్తున్నాడట.
పరశురామ్ కి పలువురు నిర్మాతలతో అడ్వాన్స్ కి సంబంధించిన వివాదం నెలకొన్న సమయంలో ఇక విజయ్ సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్టే అని భావించారు అందరూ. అలాంటిది, దిల్ రాజు దగ్గరుండి ఆ ఇష్యూ ని సాల్వ్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేయటం ఒక రకంగా పరశురామ్ కి లక్కీ ఛాన్స్ వచ్చినట్టే అని చెప్పాలి. మరి, ఈ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకొని పరశురామ్ విజయ్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News