Tollywood: రకుల్‌ కు ఛాన్సులు రాకుండా చేస్తున్న టాలీవుడ్‌ హీరో ?

టాలీవుడ్‌ స్టార్ హీరో నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. నాగార్జున తన కెరీర్లో ఎంతోమంది కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తన వల్ల ఎంతోమంది హీరోయిన్లు వారి కెరిర్ లో సెటిల్ అయ్యి మంచి పొజిషన్ లో ఉన్నారు. అందులో చాలా వరకు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారు ఎక్కువ. అయితే నాగార్జునతో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ అయినా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.

తనతో సినిమా చేస్తే వారి కెరిర్ మంచి ఫామ్ లోకి వస్తుందని భావించే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్, పూనమ్ బజ్వా కూడా ఒకరు. వీరు కూడా నాగార్జునతో సినిమాలో నటించే అవకాశం వస్తే వారి కెరీర్ మంచి ఫామ్ లోకి వస్తుందని ఎంతో సంతోషంతో సినిమా చేశారట. కానీ నాగార్జునతో సినిమా చేసిన అనంతరం వారి కెరీర్ పూర్తిగా నాశనం అయిందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పూనమ్ బజ్వా ఈ హీరోయిన్ నాగార్జునతో కలిసి బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అతి చిన్న వయసులోనే పూనమ్ బజ్వా సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.

కానీ నాగార్జునతో సినిమా చేసిన అనంతరం తనకు తెలుగులో సినిమా అవకాశాలు రాలేదట. నాగార్జునతో సినిమా చేయడం తాను చేసిన పెద్ద తప్పు అని ఫీల్ అయిందట. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన కెరీర్ నాశనం అయిందని ఫీలవుతుందట. మన్మధుడు-2 సినిమాలో నాగార్జునతో కలిసి నటించింది. ఆ సినిమాలో నాగార్జునతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడంతో తనకు అవకాశాలు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అనంతరం రకుల్ కి ఆఫర్లు ఇవ్వడానికి ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదట. దీంతో నాగార్జున వల్లే ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్ నాశనమైందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు