Sankranthi Movies 2024 : నాలుగు సంక్రాంతి సినిమాలకు చివరి 20 నిమిషాలే కీలకం

ఎలాంటి సినిమాకైనా కూడా క్లైమాక్స్ అనేది అత్యంత కీలకం. మూవీ ఓవరాల్ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా, క్లైమాక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం మూవీ మేకర్స్ కు బాగా తెలుసు. అయితే ఈ రూల్‌ను ఫాలో అవుతూనే గ్రిప్పింగ్ ఇంటర్వెల్, కిక్ ఇచ్చే క్లైమాక్స్ ని తమ సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు డైరెక్టర్స్. ఈ రెండు అంశాలు బాగుంటే మూవీ సక్సెస్ అయినట్టే అనేది వాళ్ళ నమ్మకం. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల విషయంలోనూ చివరి 20 నిమిషాలే కీలకం కావడం విశేషం. నాలుగు సినిమాలకు కూడా క్లైమాక్స్ కీలకం అనే టాక్ నడుస్తోంది.

1. గుంటూరు కారం
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మూవీ టాక్ సంగతి పక్కన పెడితే “గుంటూరు కారం” మూవీకి చివరి 20 నిమిషాలు కీలకమని అంటున్నారు. తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ మూవీకి హైలెట్ గా నిలుస్తాయని, ఈ చివరి 20 నిమిషాల్లో సీనియర్ నటుడు రావు రమేష్, రమ్యకృష్ణ, మహేష్ బాబు మధ్య నడిచే సీన్స్ అదిరిపోతాయని ప్రచారం జరుగుతుంది. అయితే మూవీ రిలీజ్ కి ముందే ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా సినిమాలో చివరి 40 నిమిషాలు అదిరిపోతుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ “గుంటూరు కారం” మూవీ అంచనాలను అందుకోలేకపోయింది.

2. హనుమాన్
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ – యంగ్ హీరో తేజ కాంబినేషన్లో వచ్చిన రెండవ మూవీ “హనుమాన్”. సూపర్ హీరో జోనర్లో రూపొందిన ఈ మూవీ ఈరోజు అంటే జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ముందు నుంచే భారీ అంచనాలు ఉన్న “హనుమాన్” మూవీకి పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ మూవీకి కూడా చివరి 20 నిమిషాలు హైలెట్ అని, “హనుమాన్” భక్తులకు పూనకాలు తెప్పిస్తుందని, ఆ 20 నిమిషాల్లోనే మేకర్స్ సస్పెన్స్ లో ఉంచిన “హనుమాన్” రివీల్ అవుతాడని సమాచారం. “గుంటూరు కారం” మూవీకి పోటీగా వచ్చిన “హనుమాన్” విజువల్స్ తో మ్యాజిక్ చేసి ఈ పోటీలో విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది.

- Advertisement -

3. సైంధవ్
హిట్ ఫేమ్ డైరెక్టర్ శైలేష్ కొలను – సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సైంధవ్”. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. వెంకీ అభిమానులకు ఈ సంక్రాంతికి పక్కా హిట్ అనే కాన్ఫిడెన్స్ ను ఇచ్చింది. జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న “సైంధవ్” మూవీకి కూడా చివరి 20 నిమిషాలే కీలకం. ఈ విషయాన్ని హీరో వెంకటేష్ స్వయంగా వెల్లడించారు. “సైంధవ్” మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని, చివరి 20 నిమిషాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి అని చెప్పుకొచ్చారు.

4. నా సామి రంగ
నాగార్జునకు కలిసి వచ్చే మాస్ అండ్ రొమాంటిక్ జోనర్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ “నా సామి రంగ”. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున, కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీ మొత్తం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నడిచినప్పటికీ, చివరి 20 నిమిషాలు మాత్రం ఎమోషనల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. పైగా క్లైమాక్స్ సినిమాపై మంచి ఎఫెక్ట్ చూపిస్తుందని టాక్ నడుస్తోంది.

మొత్తానికి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నాలుగు సినిమాల సక్సెస్ కూడా చివరి 20 నిమిషాల మీదే ఆధారపడి ఉండడం విశేషం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు