Raviteja: టైగర్ కి అసలైన జోడి గాయత్రీ.. మరి నుపుర్ సంగతేంటి?

 

టాలీవుడ్ లో ఈ దసరా కి రిలీజ్ అవుతున్న భారీ సినిమాల్లో “టైగర్ నాగేశ్వరరావు” ఒకటి. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన విషయం తెలిసిందే. గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్20న పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా, రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తూ, భారీ ప్రమోషన్లతో హైప్ ఎక్కిస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఇద్దరు భామలు హీరోయిన్లుగా నటించారన్న సంగతి తెలిసిందే. ఒకరు ముంబై బ్యూటీ నుపుర్ సనన్, మరొకరు బెంగుళూర్ భామ గాయత్రీ భరద్వాజ్. అయితే సినిమా స్టార్ట్ అయినప్పటినుండి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ నుపుర్ సననే అని అందరూ అనుకున్నారు. మూవీ మేకర్స్ కూడా నుపుర్ సనన్ కే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ‘ఇచ్చేసుకుంటా’ పాటలో గాయత్రీ భరద్వాజ్ రవితేజ భార్యగా కనిపించింది. అంటే మెయిన్ హీరోయిన్ నుపుర్ సనన్ కాదని తేలిపోయినట్టే.

- Advertisement -

మరి సినిమా ట్రైలర్ లో నుపుర్ సనన్ ని ప్రేమిస్తున్నట్టు చూపించి ఈ పాటలో గాయత్రీ తో చూపించడం డైరెక్టర్ క్రియేటివిటీ ఏముంది అని చర్చిస్తున్నారు నెటిజన్లు. కొందరైతే నుపుర్ సనన్ ని టైగర్ ప్రేమించాక ఒక సందర్భంలో చనిపోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తెలుగు సినిమా డైరెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది… అవసరం లేకపోయినా చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ని పెట్టి, పాటలకి పరిమితమయ్యే రోల్స్ ఇవ్వడం, లేకపోతే పాట తర్వాత హీరోయిన్ ని చంపేయడం కామన్ అయిపొయింది. అలాగే ఈ సినిమాలో కూడా నుపుర్ సనన్ కి లేదా, గాయత్రీ భరద్వాజ్ కి అలాంటి రోల్ ఇచ్చారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు