DNS : నాగార్జున, ధనుష్ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ లీక్ చేసిన హీరో

DNS :  టాలీవుడ్ కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసి వస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాలు మాత్రమే నాగ్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్నాయి. ఆ మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతున్నాయి. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు, నా సామి రంగ సినిమాలు అందుకు నిదర్శనం. అందుకే నాగ్ మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేశారు. తాను నటిస్తున్న నెక్స్ట్ మూవీ 2025 సంక్రాంతికి రాబోతుందన్న విషయంపై తాజాగా హింట్ ఇచ్చారు నాగార్జున.

ప్రస్తుతం టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ లో నాగార్జున ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోగా ధనుష్ కనిపించబోతున్నాడు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఏషియన్ గ్రూప్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీనీ #DNS అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ సంక్రాంతికి కలుసుకుందాం అంటూ తాజాగా జరిగిన ఈవెంట్లో నాగార్జున ఇచ్చిన హింట్ ఈ సినిమా గురించే అని అంటున్నారు.

2024 సంక్రాంతి కానుకగా నాగార్జున “నా సామి రంగ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ భామ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీకి గట్టి పోటీ ఉన్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అయింది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో బ్రేక్ ఈవెన్ అయిన రెండవ సినిమా ఇదే. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్లో “నా సామి రంగ” మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి.

- Advertisement -

ఈవెంట్లో చిత్ర బృందం మొత్తం పాలు పంచుకోగా, నాగార్జున చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. మీడియాకు, తన అభిమానులకు ఈ మూవీని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కేవలం మూడు నెలల్లో ఈ మూవీని పూర్తి చేయడానికి తనతో పాటు చిత్ర బృందం ఎంత కష్టపడింది అనే విషయాన్ని నాగ్ వెల్లడించారు. చివరగా నెక్స్ట్ సంక్రాంతికి కలుద్దాం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ప్రస్తుతం నాగార్జున చేతిలో ఉన్నది శేఖర్ కమ్ముల మల్టీస్టారర్ ప్రాజెక్ట్ మాత్రమే.

అందుకే 2025 సంక్రాంతికి నాగార్జున #DNS మూవీ రిలీజ్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే 2025 సంక్రాంతిపై మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర”, దిల్ రాజు “శతమానం భవతి నెక్స్ట్ పేజీ”, ప్రశాంత్ వర్మ “జై హనుమాన్” వంటి చిత్రాలతో కర్చీఫ్ వేసేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో నాగార్జున కూడా చేరిపోయారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు