Adipurush: అక్కడ ప్రమోషన్స్ లేని ఆదిపురుష్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే తిరుపతిలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ వరకు ప్రమోషన్స్ భారీ ఎత్తున చేసిన టీం రిలీజ్ దగ్గర పడిన సమయంలో ఎందుకోగానీ, స్పీడ్ తగ్గించింది. తమిళనాడు, కేరళ,కర్ణాటకలో మినిమమ్ లెవెల్ లోకూడా ప్రమోషన్స్ చేయలేదు ఈ సినిమా యూనిట్. డైరెక్టర్ ఓం రౌత్, కృతి సనన్ లు నార్త్ ప్రమోషన్స్ చేస్తుండగా సౌత్ లో మాత్రం ప్రమోషన్స్ ఆ రేంజ్ లో లేవు.

సినిమా రిలీజ్ వారం ఉండగా ప్రభాస్ యుఎస్ కి వెళ్ళటం ఒక కారణం అయితే, కృతి మినహా సౌత్ లో తెలిసిన నటులు ఒక్కరు కూడా లేకపోవటం మరో కారణంగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీజర్ సమయంలో వచ్చిన విమర్శలన్నింటికీ ఒక్క ట్రైలర్ తో సమాధానం చెప్పిన సినిమా యూనిట్, ఈ సినిమా సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉంది.

ప్రభాస్ గత రెండు సినిమాలు రాధేశ్యామ్, సాహో డిజాస్టర్ అవ్వటంతో ఈ సినిమా హిట్ అవ్వటం ప్రభాస్ కి కీలకంగా మారింది. అసలే సమ్మర్లో సరైన హిట్ లేక వెలవెలబోయిన థియేటర్లు ఈ సినిమా రిలీజ్ తో మళ్ళీ కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ద్వారా అందుకొని ప్రభాస్ తన పాన్ ఇండియా హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు