మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మెగాస్టార్ సమ్మర్ సీజన్ ని మిస్ చేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ కి సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్లో థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏ ఏడాది వేసవికి ఒక్క పెద్ద తెలుగు సినిమా కూడా లేకుండా చప్పగా సాగిందని చెప్పాలి. సమ్మర్ ఆరంభంలో వచ్చిన దసరా, ఆ తర్వాత వచ్చిన విరూపాక్ష లాంటి మీడియం రేంజ్ సినిమాలు మినహా ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాదు కదా కనీసం యావరేజ్ గా కూడా మిగల్లేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం కిందట మొదలైన భోళా శంకర్ సినిమా గనక షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కి గనక రిలీజ్ అయ్యుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఉండేదని అంటున్నారు.
తెలుగు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో అలరించకపోవటం వల్ల బిచ్చగాడు2, 2018 వంటి డబ్బింగ్ సినిమాలు క్యాష్ చేసుకుంటున్నాయి. తెలుగు నిర్మాతలు, హీరోలు పాన్ ఇండియా మోజులో పడి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుండటం, వాటి షూటింగ్ కి సమయం ఎక్కువగా పడుతుండటమే ఈ సమ్మర్లో తెలుగు సినిమాల సందడి తగ్గటానికి కారణం అని చెప్పచ్చు. భోళా శంకర్ లాంటి రీమేక్ సినిమా అయినా కరెక్ట్ గా ప్లాన్ చేసి రిలీజ్ చేసి ఉంటే సమ్మర్లో పెద్ద హీరో సినిమా లేని లోటు కొంచెమైనా తీరేది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News