Bigboss Season7: పవర్ అస్త్ర దొంగిలించిన ఆ ఇద్దరు?

Bigboss Season7:

బిగ్ బాస్ సీజన్ 7 మెల్లి మెల్లిగా పుంజుకుంటుంది. బిగ్ బాస్ లో పెద్ద సెలబ్రిటీ లు జనాలకు ఎక్కువగా తెలియని వారే ఉండడంతో ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోదు అని అందరు అనుకున్నా, రెండో వారం నామినేషన్లు మొదలైనప్పటినుండి ఆసక్తిని రేపుతోంది. అక్కడ పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ బాగా ఇంట్రెస్ట్ కలిగించగా, తాజాగా బిగ్ బాస్ లో టీమ్ రెండు జట్లుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు టీమ్ లో ఒకటి రణధీర టీం కాగా, మరొకటి మహాబలి టీమ్.

ఇక ఈ టీమ్ కి పెట్టిన ఆటలో రణధీర టీమ్ గెలిచిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో మహాబలి టీం సభ్యులైన ఇద్దరు శుభశ్రీ, దామిని బిగ్ బాస్ పేర్మినెంట్ హౌస్ మెంబర్ అయిన సందీప్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర దొంగిలించారని తెలిసింది.
ఆ విషయాన్నీ బిగ్ బాస్ కెమెరా కి చూపిస్తూ, వాళ్లే చెప్పడం జరిగింది. అయితే ఆ పవర్ అస్త్ర కోల్పోతే సందీప్ వేరొకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశాన్ని కోల్పోవడమే గాక, తన దగ్గరున్న వేరే పవర్స్ అన్నీ పోతాయి.

మరి ఇప్పుడు శుభశ్రీ దగ్గర ఉండడం వల్ల తనకి గాని, తన టీం కి గాని ఏమైనా ఎక్స్ట్రా పవర్స్ వస్తాయా అనేది చూడాలి. అయితే ఇది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగమా, లేక మరేదైనా కొత్త టాస్కా అనేది తెలియదు. అది ఫుల్ ఎపిసోడ్లో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక బిగ్ బాస్ లో ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ రావడం వల్ల కంటెస్టెంట్లు దానికి తగ్గట్టు నడుచుకోవడం కష్టమైపోతుందని వారి అభిప్రాయం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు