Vijaykanth : విజయ్ కాంత్ కు పద్మభూషణ్… కన్నుమూసిన తరువాత అవార్డులను అందుకున్న సెలబ్రిటీలు వీళ్లే

Vijaykanth : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలువురు సినీ ప్రముఖులకు పద్మ విభూషణ్, పద్మభూషణ్ వంటి అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో గత ఏడాది కన్నుమూసిన దివంగత కోలీవుడ్ స్టార్ విజయ్ కాంత్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరణానంతరం పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు గ్రహీతల లిస్టులో ఈసారి పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి వైజయంతి మాలలను పద్మ విభూషణ్ అవార్డు వరించగా, బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి, మ్యూజిక్ డైరెక్టర్ ప్యారేలాల్ శర్మ, సింగర్ ఉషా ఉతప్, దివంగత స్టార్ విజయ్ కాంత్ లకు పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. అయితే విజయ్ కాంత్ 2023 డిసెంబర్ 28న అనారోగ్య సమస్యలతో చెన్నైలో తుది శ్వాస విడిచారు. సినిమా రంగానికి విజయ్ కాంత్ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన మరణానంతరం పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది.

విజయ్ కాంత్ తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 200కు పైగా సినిమాలు చేసి తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఎందరో అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన నటించిన అన్ని పాత్రల కంటే పోలీస్ రోల్స్ ఎక్కువగా ప్రేక్షకులపై ప్రభావం చూపించాయి. ఇక విజయ్ కాంత్ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి, భారీ వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమాలు సింధూర పువ్వు, కెప్టెన్ ప్రభాకర్ తెలుగులో స్ట్రెయిట్ సినిమాలను మించి థియేటర్లలో ఆడాయి.

- Advertisement -

విజయ్ కాంత్ చేసిన పలు తమిళ బ్లాక్ బస్టర్ సినిమాలను చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలు తెలుగులో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ కాంత్ కు కన్ను మూసిన తర్వాత పద్మభూషణ్ అవార్డు రావడం అనేది ఆయనకు ఘన నివాళి అంటూ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు సినీ ప్రముఖులను ఇలాగే మరణానంతరం పద్మ అవార్డులు వరించాయి. మరి ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యంను పద్మ విభూషణ్ అవార్డు చనిపోయిన ఏడాది తర్వాత వరించింది. బాలు చనిపోయిన ఏడాది తర్వాత అంటే 2021లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఆయనతో పాటు ప్రముఖ సింగర్ వాణీ జయరాం కూడా ఈ లిస్టులో ఉన్నారు. 2023లో ఆమె పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కాగా, అవార్డును ప్రకటించిన పది రోజుల్లోనే అనుమానాస్పద రీతిలో వాణి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు