Vijay : మళ్లీ స్టార్ట్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 180 కోట్లతో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే డిజాస్టార్ టాక్ తెచ్చుకుంది. నిజానికి లైగర్ సినిమాపై డైరెక్టర్ పూరితో పాటు విజయ్ కూడా నమ్మకాలు కాస్త ఎక్కువగానే పెట్టుకున్నారు. విజయ్ కి 2018లో వచ్చిన గీతా గోవిందం తర్వాత చెప్పుకొదగ్గ హిట్ రాలేదు.

మధ్యలో టాక్సీవాలా కొంత వరకు ఊరటను ఇచ్చినా, మరీ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం అంతటి హిట్ కాలేకపోయింది. దీంతో లైగర్ సినిమాతో తన కెరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొరతను తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాదు అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు. కాగా, లైగర్ పరాజయం నుంచి విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు.

ఇదిలా ఉండగా, ఖుషి సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు హైదరాబాద్ లోని చిలుకూరు వద్ద కొత్త షెడ్యూల్ తో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి. కాగా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు