Chiranjeevi : గ్లింప్స్ కి ముహుర్తం ఫిక్స్

ప్రస్తుతం ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో పుల్‌ బిజీగా ఉన్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. తాజాగా దసరా రోజున ” గాడ్ ఫాదర్” సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో ” వాల్తేరు వీరయ్య” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ ని బట్టి మాస్ కంటెంట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా తెలుస్తుంది.

చిరంజీవి పాత్ర అధ్యంతం ఊర మాస్ గా మలుస్తున్నారు. వైజాగ్ వాల్తేరు నేపథ్యంలో సాగే స్టోరీలో ఇంకా కొన్ని బలమైన పాత్రలు సైతం కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఈ ఇద్దరూ బ్రదర్స్ గా నటించబోతున్నారు. మెగాస్టార్ కి సవతి తల్లి కొడుకు గా రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటించబోతోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఏంటంటే.. మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈ టీజర్ లేదా గ్లింప్స్ ని ఈ దీపావళి కానుకగా విడుదల చేయనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు