Tillu Square collections : 100 కోట్ల స్టార్… రెండేళ్ల క్రితం అన్నాడు ఇప్పుడు సాధించాడు

Tillu Square collections : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్.. మార్చి 29న రిలీజ్ చేయగా..ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే దూసుకుపోతోంది.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర మొదలు పెట్టింది.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా.. రూ.23.7 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 3 రోజులలోనే రూ.50కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇక నిన్నటి కి నిన్న 8 రోజుల కలెక్షన్లలో భాగంగా రూ.96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఒక్కరోజు తేడాతో రూ.101 కోట్లు సైతం రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

సోషల్ మీడియా వేదికగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు రూ.101 కోట్లు అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. డిజె టిల్లు చిత్రం 2022లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. అంతేకాదు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.. ఇప్పుడు డీజే టిల్లు కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఎగబడి ఈ సినిమాను చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉగాది పండుగ, రంజాన్ పండుగ కూడా ఉండడంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మించారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

ఇటీవలే రామ్ చరణ్ కూడా టిల్లు స్క్వేర్ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.. అలాగే చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.. టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ వెల్లడించారు. టీల్లు స్క్వేర్ చిత్రంలో మురళీ శర్మ , నేహా శెట్టి, ప్రిన్స్ , మురళీధర్ గౌడ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు.. టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర బృందం గ్రాండ్ పార్టీని ఇవ్వబోతున్నట్లు సమాచారం .ఈ పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న ఈ సినిమా సక్సెస్ మీట్ ని చిత్ర బృందం నిర్వహించబోతున్నట్లు సమాచారం.. ఈ విషయాన్ని చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.. మరి ఈ సక్సెస్ మీట్ ఎక్కడ అనే విషయం మాత్రం ఇంకా తెలియజేయలేదు. మరి రాబోయే రోజుల్లో టిల్లు స్క్వేర్ సినిమా ( Tillu Square collections ) ఎలాంటి ప్రభంజనాలను సృష్టిస్తుందో చూడాలి మరి.

- Advertisement -

మాట నిలబెట్టుకున్న టిల్లు గాడు..

ఇకపోతే 15 ఫిబ్రవరి 2022లో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మరో మూడు సంవత్సరాలలో కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరుతానని సిద్దు జొన్నలగడ్డ మాట ఇచ్చిన విషయం తెలిసిందే ..ఇక మూడు సంవత్సరాల ముగియకముందే తన టాలెంట్ తో టిల్లు స్క్వేర్ సినిమాతో రూ .100 కోట్ల క్లబ్లో చేరిపోయారు.. మొత్తానికి అయితే అనుకున్నది సాధించి.. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు సిద్దు జొన్నలగడ్డ.. ఏదేమైనా తొమ్మిది రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు