BIG breaking : జైలుకు జీవిత రాజశేఖర్ దంపతులు

నాంపల్లి కోర్ట్ జీవిత రాజశేఖర్ దంపతులకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. గతంలో ఈ ఇద్దరు దంపతులిద్దరు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా అవి అప్పట్లో సంచలనం అయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వీరిద్దరి పై పరువునష్టం దావా కేస్ వేయగా మంగళవారం రోజున నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సాయిసుధ ఈ సంచలన తీర్పు వెల్లడించారు.

2011 లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై ఈ ఇద్దరు దంపతులు మీడియా ముఖంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఒక పెద్ద స్కామ్ అని కామన్ పీపుల్ బ్లడ్ సేవ కార్యక్రమాల పేరుతో తీసుకొని బ్లాక్ లో ఆ బ్లడ్ ను అమ్ముకుంటున్నట్టు ఈ ఇద్దరు ఆరోపించగా. గీత ఆర్ట్స్ అధినేత, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వీరిద్దరు చేసిన వ్యాఖ్యల తాలూకా ఆధారాలను, మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ డిటేల్స్ లతో కేసు నమోదు చేసారు.

ఇది జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తుండగా ఇన్నాళ్లకు వీరిపై కోర్ట్ తీర్పును ప్రకటించింది. ఇద్దరు దంపతులకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష మరియు అయిదు వేల రూపాయల జరిమానాను కోర్ట్ కు జీవిత రాజశేఖర్ లకు విధించింది. అలాగే ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా వీరికి కోర్ట్ కల్పించింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు