Aadi : కృష్ణ ఫ్రమ్ బృందావనం.. లవ్& ఫ్యామిలీ డ్రామాగా!

Aadi : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఆది ఒకరు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా పద్నాలుగేళ్ల కింద ప్రేమ కావాలి చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టగా, ఆ తర్వాత లవ్లీ తో మరో హిట్టు కొట్టాడు. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటివరకు సక్సెస్ మొహం చూడలేదు ఆది. నటన పరంగా మంచి టాలెంట్ ఉన్న హీరో స్క్రిప్ట్ సెలెక్షన్లలో సరైన కథలు సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల, అలాగే ఆది ని టాలీవుడ్ దర్శకులు కూడా ఒకరకంగా సరిగా వాడుకోలేకపోయారని చెప్పాలి. అయినా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆది కొత్త సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. గతంలో
ఆది చుట్టాలబ్బాయి మూవీ కోసం పనిచేసిన వీరభద్రం చౌదరితో ఆది మళ్లీ సినిమా చేస్తున్నాడు.

లవ్& ఫ్యామిలీ డ్రామాగా..

ఇక ఆది (Aadi) హీరోగా తెరకెక్కబోయే తాజా సినిమా ఒక విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఇంకా ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీకి “కృష్ణ ఫ్రమ్ బృందావనం” అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీ పూజా కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. కాకతీయ హిల్స్‌ లోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైలాగ్ కింగ్ సాయి కుమార్ హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌ కు దిల్ రాజు క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆది, సాయి కుమార్, వీరభద్రం చౌదరి మాట్లాడారు. ఆది మాట్లాడుతూ “చుట్టాలబ్బాయి తర్వాత మరో సినిమా చేయాలని వీరభద్రం గారు, నేను ప్రయత్నించాం. ఇప్పుడు ఇన్నాళ్ళకు మంచి స్క్రిప్ట్ దొరికింది. ఆడియన్స్ తమ కుటుంబంతో కలిసి చూసి నవ్వుకునేలా ఈ మూవీ ఉంటుందని, జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

హీరోయిన్ రిపీట్..

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దిగంగనా సూర్యవంశీ నటిస్తుంది. ఇంతకు ముందు ఆది క్రేజీ ఫెల్లో మూవీలో వీరిద్దరూ అల్రెడి నటించగా, ఇప్పుడు రెండో సారి ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇక మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని మేకర్స్ అన్నారు. అలాగే డైరెక్టర్ వీరభద్రం మాట్లాడుతూ ఈ మూవీలో హీరోయిన్ రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉందని తెలిపారు. ఈ సినిమాను ప్రొడ్యూసర్లు తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్‌ గా నిలుస్తాయని అన్నారు. ఇక ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు ఆది సినిమాలకి మంచి ట్యూన్స్ ఇచ్చిన అనూప్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి ఆదితో కలిసి పనిచేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు