Rajamouli : బాహుబలి సినిమా పై తమన్నా సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు జక్కన్న. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ.. ఇలా ఏ పాత్రకి తగ్గట్టు ఆ పాత్రకు క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశారు రాజమౌళి.

అయితే ఈ సినిమాలోని మొదటి భాగంలో హీరోయిన్ గా తమన్నా.. రెండవ భాగంలో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాహుబలి కి సంబంధించిన ప్రశ్న తమన్నాకి ఎదురైంది. ఈ సందర్భంగా ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమన్నా. ” నేను యాక్షన్ సినిమాలలో నటించిన కూడా క్రెడిట్ మాత్రం అంతగా రాలేదు. ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్, రానాకు మాత్రమే ఆ క్రెడిట్ దక్కింది. ఈ సినిమా క్రెడిట్ వారికి దక్కడం న్యాయమే. ఎందుకంటే ఆ మూవీ కోసం వాళ్ళిద్దరూ చేసిన దానితో పోలిస్తే నా పాత్ర ఎంతో తక్కువ.

అలాగే ఈ సినిమాలో నటించిన రమ్యకృష్ణ, అనుష్కకి కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. కానీ నాకు అంతగా గుర్తింపు రాలేకపోయింది. దానికి అసలు కారణం నా క్యారెక్టర్ చాలా చిన్నగా ఉండడమే. అసలు ఈ సినిమాలో నేను నటించానని చాలా తక్కువ మందికి తెలుసు. అయినప్పటికీ అలాంటి భారీ చిత్రంలో నేను పోషించిన అవంతిక పాత్రకు లభించిన క్రేజ్ కి అందరికీ కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు