Swathimutyam: ఆద్యంతం ఆసక్తికరం

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో, లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ‘స్వాతిముత్యం’ సినిమాలో బాలమురళి పాత్రలో గణేష్ నటిస్తుండగా, భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ కనిపించనుంది. జీవితం-ప్రేమ-పెళ్లి వంటి వాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాటి మధ్య స్వాతిముత్యం లాంటి యువకుడి జీవిత ప్రయాణం-ప్రేమాయణం ఎలా సాగింది అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఇక తాజా ఈ మూవీ హీరో గణేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్, ట్రైలర్ పేరుతో ఓ సంక్షిప్త ప్రచార చిత్రం ను విడుదల చేసింది చిత్ర బృందం. దాదాపు 40 క్షణాల పాటు సాగే ఈ దృశ్య మాలిక ఆధ్యాంతం సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. “మన బాలు ఏం చేశాడో కొంచెం నీకు అర్థం అయ్యేలా చెబుతాను, చెప్పండి, అంటే, అది,! కొంపదీసి ఏదన్నా ప్రాబ్లమా,ప్రాబ్లమా, ప్రాబ్లమ్ ఏముంటుందండి? మీరు ఇంకా సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమయింది” వంటి సంభాషణలు నాయిక, నాయకుల మధ్య వినిపిస్తాయి. రావు రమేష్, వెన్నెల కిషోర్ లు కూడా ఇందులో చిత్రానుసారం కనిపిస్తారు. చిత్రం థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదల అన్న ప్రకటనతో పాటు, దసరా శుభాకాంక్షలు తో ప్రేక్షకుల ముందుకు “స్వాతిముత్యం” ను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు