IPL: ఐపీఎల్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా సౌత్ స్టార్స్

ప్రతి సంవత్సరం ఇండియా లో ఐపీఎల్ మ్యాచ్ లు సమ్మర్ లో ప్రధాన నగరాల్లో జరుగుతాయి. అలాగే ఇప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని లీగ్ మ్యాచ్ లు జరుగగా ఇంకా రాబోయే రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఇక ఐపీఎల్ కి సినిమా ఇండస్ట్రీ కి కూడా మంచి సంబంధం ఉంది. ఐపీఎల్ టీమ్ లలో ఉన్న కెకెఆర్ కి షారుఖ్ ఖాన్ యజమాని కాగా, పంజాబ్ టీమ్ కి ప్రీతి జింటా ఓనర్. ఇంకా రాజస్థాన్ రాయల్స్ కి శిల్పా శెట్టి భాగస్వామి. ఇక ఈ ఐపీఎల్ మ్యాచెస్ ని సినీ ప్రముఖులు కూడా వీక్షిస్తూ అప్పుడప్పుడు గ్రౌండ్ లో సందడి చేస్తూ తమ అభిమాన టీమ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.

ఇటు టాలీవుడ్ లోను క్రికెట్ ను అమితంగా ఇష్టపడే వెంకటేష్, రామ్ చరణ్ లు తరచుగా హైదరాబాద్ మ్యాచ్ చూడ్డానికి వస్తారని తెలిసిందే. అలాగే ఈ సీజన్ లో కూడా ఐపీఎల్ ని చూడడానికి చాలా మంది సెలబ్రిటీ లు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నటి బిందు మాధవి, వరలక్ష్మి శరత్ కుమార్, ఇంకా శివ కార్తికేయన్ లు చెన్నై మ్యాచుల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సౌత్ కి చెందిన ఇద్దరు స్టార్లు ఏప్రిల్ 17 న జరిగిన మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

వివరాల్లోకి వెళితే ఐపీఎల్ లో ఫేమస్ టీమ్ లు అయిన చెన్నై, ఆర్సీబీ మ్యాచ్ బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ను ప్రత్యేకంగా వీక్షించేందుకు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో పాటు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ విచ్చేసారు. ఈ సందర్భంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిద్దరూ ఎంజాయ్ చేస్తున్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్టిల్స్ చూస్తున్న అభిమానులు ఆనందంతో మురిసిపోతున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు