Sita Ramam : కృష్ణమ్మ ఒడిలో.. విశాఖ తీరంలో

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. దుల్కర్ సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాళిని ఠాకూర్‌ నటిస్తుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్రలో కనిపిస్తుంది. అలాగే సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. వైజాయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సినిమాను నిర్మిస్తున్నాడు.

కాగా, ఈ సినిమా ఆగస్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్‌, డైరెక్టర్ హను రాఘవపూడి తో పాటు సుమంత్ పలు ఇంటర్వ్యూలో కనిపించారు. ఇప్పుడు చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ టూర్ వేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ నెల 31న ఆంధ్ర ప్రదేశ్ లో టూర్స్ వేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్‌ ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణమ్మ ఒడిలో పర్యటించనున్నారు. విజయవాడలోని PVP మాల్ లో ఫ్యాన్స్ తో మాట ముచ్చట నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీకి వస్తున్నట్టు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అంచనాలను భారీగా పెంచాయి. ఇప్పుడు ప్రమోషన్స్ తో మరింత హైప్ క్రియేట్ అవడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు