Sandeep Reddy Vanga: వివక్ష చాలా సార్లు చూశా… నెపోటిజంపై యానిమల్ డైరెక్టర్ మరోసారి కామెంట్స్

Sandeep Reddy Vanga: గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సినిమాల్లో యానిమల్ మూవీ ముందు వరుసలో ఉంటుంది. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ 915 కోట్లను వసూల్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాపై ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో… అంతే నెగిటివ్ టాక్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగా సినిమాకు నెగిటివ్ టాక్ రావడం ఇదేం కొత్త కాదు. గతంలో సందీప్ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీన్నే బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు. ఇది కూడా హిట్ అయింది. కానీ, ఈ రెండు సినిమాలకు కొంతమంది క్రిటిక్స్ నుంచి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది.

ఇప్పుడు 915 కోట్లు వసూళ్లు చేసిన యానిమల్ మూవీకి కూడా కొంత మంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. దీనిపై తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉంటుందని, కొత్తగా ఎవరు వచ్చిన వాళ్లని తొక్కేస్తారు అంటూ కామెంట్ చేశాడు. బాలీవుడ్ లో నెపోటిజం గురించి మాట్లాడాలంటే.. రెండు రోజులు కూడా సరిపోదని అన్నారు. హిందీ పరిశ్రమలో ఉన్న వివక్ష గురించి అందరికీ తెలిసిందే అని, అవార్డ్ ఫంక్షన్స్ లలో తాను చాలా సార్లు వివక్షను చూశాను అంటూ కామెంట్ చేశాడు సందీప్ రెడ్డి.

అలాగే క్రిటిక్స్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో ఉన్న క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు రాయడానికి డబ్బు తీసుకుంటారని ఆరోపించాడు. ఒక సినిమాకు డబ్బులు తీసుకుని పాజిటివ్ రివ్యులు రాస్తారు. అప్పుడు రిలీజ్ అయిన మరో సినిమాను టార్గెట్ చేస్తూ నెగిటివ్ రివ్యూలను ఇస్తారంటూ మండిపడ్డాడు. ఇదే తన యానిమల్ సినిమా విషయంలో జరిగిందని అన్నారు. తన యానిమల్ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్లు అందరూ తనను, తన సినిమా యానిమల్ ను టార్గెట్ చేసిన వాళ్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు