Ramajogayya Sastry Out from Twitter: పాపం రామ్ జో… గుంటూరు కారం ఘాటు ఎక్కువైంది..!

రామ జోగయ్య శాస్త్రీ… తెలుగు ఇండస్ట్రీలో పేరున్న గీత రచయిత. టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ రెమ్యుననేషన్ తీసుకునే గీత రచయిత ఈయనే. ఆయన నుంచి వచ్చే పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ, ఇటీవల గుంటూరు కారం సినిమా ఈయన ఇచ్చిన లిరిక్స్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అవి కూడా స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచే. దీనిపై రామ్ జో కుక్కలు… ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి అంటూ ఘాటు పదాలతో కౌంటర్ ఇచ్చాడు.

దీంతో ఫ్యాన్స్ ఫోకస్ లిరిక్స్ నుంచి రామ జోగయ్య పైకి షిప్ట్ అయింది. “అభిమానులు అన్నాక తమ హీరో సినిమా నుండి అన్నీ ఎక్కువగా ఉండాలి ఆశించడం సహజం. అది ఒక్కోసారి హద్దులు దాటిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దానిని పర్సనల్ గా తీసుకుని రామ్ జోగయ్య ఇలా అభిమానుల పై మండిపడటం ఎందుకు..! ఇది పెద్దరికం అనిపిసిస్తుందా? లిరిక్స్ బాగుంటే.. అవార్డులు వస్తాయి. బాగలేకుంటే.. ఇలాంటి ట్రోల్స్ వస్తాయి. అవార్డులను స్వీకరించినప్పుడు.. ఇలాంటి విమర్శలను కూడా తీసుకోవాలి” అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఫ్యాన్స్ అయితే… తమను కుక్కలు అంటారా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ కాస్త ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంత చూసిన రామ జోగయ్య.. ట్విట్టర్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. తన ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసి.. తాత్కాళికంగా తనపై వస్తున్న ట్రోల్స్ నుంచి తప్పించుకున్నాడు.

- Advertisement -

అయితే ఈ చిన్న విషయానికి రామ్ జో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. గతంలో ‘గీత గోవిందం’ సినిమా టైంలో ఓ పాటకి శ్రీమణి ని ట్రోల్ చేసినదాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇప్పుడు శ్రీమణి విమర్శలను తీసుకున్నాడు. కానీ, ఇప్పుడు రామ్ జో తీసుకోకుండా తొందర పడి ఫ్యాన్స్ పైనే ఆరిచాడు. దీని వల్ల ఇన్నాళ్ల నుంచి కాపాడుకువస్తున్న పేరు కాస్త గంగలో కలిసిపోయింది. అలాగే ట్విట్టర్ కి దూరం కావాల్సి వచ్చింది.

ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఫిలిం మేకర్స్ కి పొగరుతో పాటు ఓపిక అనేది కూడా అవసరం. అని అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు