Puri jagannath: వాడి వల్లే రూ.80కోట్లు నష్టపోయామ్ – పూరీ జగన్నాథ్ తల్లి

Puri jagannath

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన పూరీ జగన్నాథ్ అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నారు. ఎంతోమంది హీరోలకి తన అద్భుతమైన కథలతో స్టార్ హీరోలుగా గుర్తింపు వచ్చేలా చేసిన పూరీ జగన్నాథ్ డైరెక్టర్ గానే కాకుండా నటుడుగా , నిర్మాతగా కూడా సినిమాలను తెరకెక్కించారు.. ఎంత పెద్ద చిత్రాన్నైనా కేవలం మూడు నెలల లోనే అదిరిపోయే క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమాని ఫినిష్ చేయగలిగిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు పూరీ జగన్నాథ్. అయితే ఈ మధ్య పూరీ జగన్నాథ్ కు సరైన సక్సెస్ లేకపోవడం తో అప్పటి వరకూ ఉన్న క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది.

గతంలో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ సినిమా దారుణమైన ఫ్లాప్ కావడంతో ఎన్నో రకాల ట్రోల్స్ కి గురైన సందర్భాలు ఉన్నాయి. దీంతో చాలా మంది నటీనటులు పూరీ జగన్నాథ్ తో సినిమా తీయడానికి కాస్త భయపడేవారు. ఇలాంటి సమయంలోనే మళ్లీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రాన్ని రామ్ తో కలిసి తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారు. పూరీ జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో.. ఒకానొక పరిస్థితులలో రోడ్డును పడే పరిస్థితి వచ్చిందని దీనివల్ల కొన్ని కోట్ల రూపాయల నష్టం కలిగింది అని పూరీ జగన్నాథ్ తల్లి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది వాటి గురించి చూద్దాం.

పూరీ జగన్నాథ్ తల్లి మాట్లాడుతూ తన కొడుకు పడ్డ కష్టం ఎవరూ పడకూడదని డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాదుకి వచ్చి ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారని.. ఏడవ తరగతి నుంచి వాడికి సినిమాలు అంటే చాలా ఇష్టం.. అయితే ఒకరోజు తాను కూడా హైదరాబాదుకి వెళ్ళగా తన కొడుక్కి ఇంకా అప్పటికి అవకాశాలు రాలేదని కాళ్లు చూస్తే చాలా వాచిపోయి ఉన్నాయి.. సాక్సులు వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.. అది చూసి చాలా ఏడ్చాను.. ఆ బాధతో ఊరికి వచ్చి పొలం పనులు చేసుకో అని చెప్పాను.. అయినప్పటికీ వినకుండా ఎన్నో రోజులు అన్నం తినకుండా, మంచినీళ్లు తాగకుండా తిరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

డైరెక్టర్ అయ్యాక పూరీ జగన్నాథ్ దగ్గర పని చేసే ఒక కుర్రాడు రూ.80 కోట్లు కొట్టేసి మోసం చేశారని..ఒక సినిమా వల్ల కూడా నష్టపోయారని.. దీంతో ఒక్కసారిగా కుటుంబం పై పెద్ద నష్టం పడింది. దాదాపుగా తన దగ్గర ఉండే ఐదు ఇల్లులు అమ్మేశారని… దీంతో ఆస్తి కూడా పోవడం జరిగింది.. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్.. మోసం చేసిన వాడి కాళ్లు చేతులు విరిచేద్దామని పూరీకి సలహా ఇచ్చారట.. కానీ పూరి జగన్నాథ్ వదిలెయ్.. వాడికి ఏ జన్మలో రుణపడి ఉన్నామో..అలా జరిగింది అంటూ సైలెంట్ గా ఉన్నారట.. అతని వల్ల తన కుమారుడు నష్టపోయారని తెలియజేస్తోంది పూరీ జగన్నాథ్ తల్లి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు