Project K: దీపిక మొదటి ఛాయిస్ కాదా?

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. వీటి తర్వాత కూడా ప్రభాస్ భారీ సినిమాలే చేస్తున్నారు. అందులో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి విధితమే. అయితే ప్రాజెక్ట్ కె చిత్రం కథ నాయక గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ముందుగా ఈ చిత్రంలో కథ నాయక పాత్రకు దీపికా పదుకొనె ను అనుకోలేదట. తొలుత బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారట.

ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అశ్విని దత్ వెల్లడించారు. సీతా రామం సినిమాలో సీత పాత్రకు మృణాల్ సెట్ అవుతుందని, ప్రాజెక్ట్ కె కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని నాగ్ అశ్విన్ కు తాను సూచించినట్లు ఆయన తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ కె కోసం దీపికా పదుకొనె ను నాగ్ అశ్విన్ ఎంపిక చేశారట. అయితే మృణాల్ నటించిన సీతా రామం సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు