Kollywood News: గంటకు ఐదు వేలు… నటి కస్తూరిపై బోల్డ్ కామెంట్స్..!

తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినాప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగార్జునతో అన్నమయ్య, బాలకృష్ణతో నిప్పురవ్వ, మోహన్ బాబుతో సోగ్గాడి పెళ్ళాం, రాజశేఖర్ తో మా ఆయన బంగారం, రథయాత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది కస్తూరి.

ఇప్పుడు పలు టీవీ సీరియల్స్, షోలలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే ఇతర విషయాలతోనూ వార్తలలో నిలుస్తుంది ఈ అందాలతార. కస్తూరి నిత్యం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా, వ్యక్తిగతంగా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైంది. ఇందులో తమిళ పాపులర్ నటి వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 3 లో వనిత విజయ్ కుమార్ తో పాటు కస్తూరి శంకర్ కూడా పాల్గొంది.

అయితే ఇక జోవిక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పై కస్తూరి శంకర్ కు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై కస్తూరి స్పందిస్తూ.. “ఓ ఇంట్లో కొంతమందిని ఉంచి వారిని ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ చూపే షోను నేను పట్టించుకోను. నాకు అంత సమయం, ఓపిక, ఆసక్తి లేదు. నాకు కుటుంబ బాధ్యత, పనితోనే సరిపోతుంది” అంటూ ట్వీట్ చేసింది.

- Advertisement -

ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో నెటిజెన్లు పలు రకాలుగా ఆమెపై ట్రోల్లింగ్ చేస్తున్నారు. “డబ్బుల కోసం బిగ్ బాస్ కి వెళ్లిన నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు. మీకు ఎలాగైనా గంటకు 5 వేలు వస్తాయి కదా..!” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతని కామెంట్ పై తీవ్రస్థాయిలో మండిపడింది కస్తూరి. ” మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలాగే పెంచారా..? సిగ్గు లేదా..? అంటూ ఆ నెటిజన్ పై ఫైర్ అయ్యింది.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు