Manmadhudu: అభి ను కలిసిన అను

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి స్వయంవరం సినిమాతో రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని అద్భుతమైన పేరును సంపాదించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ రాసిన ప్రతి సినిమా మంచి హిట్ అయింది. పోస్టర్ పైన త్రివిక్రమ్ పేరు చూసి కూడా సినిమాకెళ్లే ఆడియన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతటి ఇంపాక్ట్ ను తన రైటింగ్ తో క్రియేట్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

త్రివిక్రమ్ స్వయంవరం సినిమాతో ఎంట్రీ అయిన తర్వాత చాలామంది అప్పటి స్టార్ హీరోలతో కూడా పనిచేశాడు. వాళ్ళ సినిమాలకు కథలను అందించాడు. త్రివిక్రమ్ కెరియర్ లో అలా చూసుకుంటే “నువ్వు నాకు నచ్చావ్” సినిమా పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మల్లీశ్వరి సినిమా కూడా త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేశాడు. అలానే నాగార్జున నటించిన మన్మధుడు సినిమా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ డైలాగ్స్ ను అందించాడు.

మన్మధుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. రీసెంట్ గా రీ రిలీజ్ అప్పుడు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్, నాగార్జున పెర్ఫార్మెన్స్, బ్రహ్మానందం కామెడీ ఇవన్నీ కూడా పవర్ ప్యాకెడ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తాయి. త్రివిక్రమ్ రైటింగ్ కూడా ఈ సినిమాకి అద్భుతంగా ఉంటుంది.

- Advertisement -

అయితే ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మొత్తం ఇద్దరు హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ పేరు అన్షు. అన్షుతో ప్రేమలో పడతాడు అభి. అయితే ఒక అనుకోని సంఘటన వలన అన్షు ఈ సినిమాలో చచ్చిపోతుంది. ఈ విషయం తెలియక ఆడవాళ్లపై కోపాన్ని పెంచుకుంటాడు అభి. తర్వాత నిజాన్ని తెలుసుకొని తనకు తాను రియలైజ్ అవుతాడు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాని డిజైన్ చేసిన విధానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

ఇకపోతే మన్మధుడు సినిమా రీ రిలీజ్ అయినప్పుడు కూడా చాలామందికి ఈ సినిమా అద్భుతంగా తీశారు అని ఫీల్ కలిగింది. త్రివిక్రమ్ బాగా రాసాడు అనే ఫీల్ కూడా కలిగింది. ఇకపోతే మన్మధుడు సినిమాలో అన్షు క్యారెక్టర్ లో నటించిన అన్షు ను రియల్ లైఫ్ లో నాగార్జున కలిశారు. రీసెంట్ గా ఒక ప్రవివేట్ పార్టీలో వీళ్ళిద్దరూ ఆఫ్ స్క్రీన్ లో కలిశారు. వీరిద్దరూ కలిసిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక నాగర్జున గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా “నా సామి రంగా” సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అలానే తన నెక్స్ట్ సినిమా సంక్రాంతికి రాబోతుందని అనౌన్స్ కూడా చేసేసాడు. ఇకపోతే సంక్రాంతికి మళ్లీ ముగ్గురు సీనియర్స్ స్టార్ హీరోల సినిమాలు రానున్నాయి. వారిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో రానున్నారు. పండక్కి వస్తున్నాం అనే పేరుతో విక్టరీ వెంకటేష్ రానున్నారు. నాగార్జున చేస్తున్న సినిమా పేరుని ఇంకా ఫిక్స్ చేయలేదు. నాగార్జున కూడా సంక్రాంతి బరిలో దిగనున్నట్లు అందరికంటే ముందుగానే అనౌన్స్ చేశారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు