Naga Vamsi : మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కిన ప్రొడ్యూసర్ నాగవంశీ

Naga vamsi

పలు సూపర్ హిట్ చిత్రాల నిర్మాత ప్రొడ్యూసర్ నాగ వంశి మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కాడు. ఇటీవల కాలంలో నాగ వంశి ప్రొడ్యూసింగ్ చేస్తోన్న సినిమాల ప్రెస్ మీట్ లలో ఆయన పాల్గొంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే.ఇక లేటెస్ట్ గా ఆయన బ్యానర్ నుంచి వస్తోన్న సినిమా మ్యాడ్ .కళ్యాణ్ శంకర్ అనే డెబ్యూ డైరక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవబోతున్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ లో కథ తో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్స్ మిగితా ఆర్టిస్ట్స్అందరు కొత్త వాళ్ళు అవడంతో వాళ్ళందరిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ నిన్న ప్రెస్ మెట్ నిర్వహించారు మేకర్స్.

ఇక ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ప్రొడ్యూసర్ నాగ వంశీ గుంటూరు కారం సినిమాకు సంబందించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను అందించారు. అలాగే మ్యాడ్ సినిమా గురించి మాట్లాడుతూ.. జాతి రత్నాలు సినిమా కంటే కూడా మ్యాడ్ సినిమా చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. జాతి రత్నాలు సినిమాను చూసి ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ చేసారో..మ్యాడ్ సినిమాను కూడా అంతే ఎంజాయ్ చేస్తారని ఒక వేళా మ్యాడ్ సినిమా చూసి గనక ప్రేక్షకులు నవ్వకపోతే వాళ్ళ టికెట్స్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా అంటూ కామెంట్స్ చేసారు అంతే కాదు ఇదే విషయాన్నీ జాతి రత్నాలు సినిమా తీసిన డైరక్టర్ అనుదీప్ తో కూడా చెప్పించారు.

- Advertisement -

అయితే నాగ వంశి ప్రెస్ మీట్ వ్యవహరించిన తీరు మరియు మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. సందర్భం లేకపోయిన కూడా పబ్లిసిటీ కోసం మీడియా తో ప్రవర్తించిన తీరును మీమర్స్ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. . ఇక గతంలో కూడా ఈయన ఇదే విధంగా ఇంటర్వ్యూలలో అవతార్ సినిమా నచ్చలేదని , కాంతార సినిమాలో ఏమి లేదని మాట్లాడగా అవి వైరల్ అయిన విషయం తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు