Karthikeya 2 : ట్రైలర్ రెడీ

టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కార్తికేయ-2 ఒకటి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న ఈ సినిమా 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయా-2 తెరకెక్కుతుంది. స‌స్పెన్స్ థిల్లర్ సినిమాగా రూపొందుతుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమా ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ఈ నెల 12న పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ-2 విడుదల కానుంది. దీని కోసం మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అందరిలా కాకుండా డిఫరెంట్ స్టైల్ లో కార్తికేయా-2 టీం ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ లో గెలిచిన విజేతలకు 6 లక్షల విలువ గల శ్రీకృష్ణుడి బంగారు విగ్రహాలను ప్రైజ్ మనీగా పొందవచ్చని దర్శక నిర్మాతలు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ రెడీ గా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ-2 ట్రైలర్ ను ఆగస్టు 6న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను హీరో నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా, కార్తికేయ-2 నుంచి నెల క్రితమే ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. 1:27 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఫుల్ ట్రైలర్ వస్తే, సినిమాపై అంచనాలు భారీగా పెరగడం ఖాయం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు