Karthika deepam 2 : ఏ పాత్రలో ఎవరంటే..?

Karthika deepam 2 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సీరియల్ కార్తీకదీపం.. ఇప్పటికే కార్తీకదీపం సీరియల్ భారీ రేటింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఊహించని ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కార్తీకదీపం సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. కార్తీకదీపం నవవసంతం పేరుతో ఈ సీక్వెల్ ని ప్రసారం చేస్తున్నారు దర్శకనిర్మాతలు.. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి స్టార్ మా చానల్లో రాత్రి 8 గంటలకి ఈ కార్తీకదీపం 2 ప్రసారం అవుతోంది.ఈ క్రమంలోనే కార్తీకదీపం లో వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలు ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే.. ఇక ఇవే పాత్రలు సీక్వెల్ లో కూడా ఉంటాయని అందరూ అనుకున్నారు.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డాక్టర్ బాబు దీప పాత్రలు మినహా అన్ని పాత్రలను చేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది.. మరి ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ఇప్పుడు చూద్దాం..

కార్తీకదీపం -2 పాత్రలు..

నిరూపమ్ పరిటాల.. డాక్టర్ కార్తీక్ పాత్రలో నటిస్తున్నారు.. అలాగే దీప క్యారెక్టర్ లో వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ నటిస్తోంది.. ఇక దీప కూతురిగా శౌర్య పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర ను తీసుకున్నారు.. ఇక కార్తీక్ తల్లి కాంచన పాత్రలో సౌందర్య కి బదులుగా కాంచనను తీసుకోవడం జరిగింది.. ఇక కార్తీక్ తండ్రి గా రత్నం క్యారెక్టర్ లో శ్రీధర్ నటిస్తున్నారు.. కార్తీక్ అత్త సీతా పాత్రలో సుమిత్ర నటిస్తూ ఉండగా.. కార్తీక్ నానమ్మ నట కుమారి పాత్రలో పారిజాతం నటిస్తున్నారు.. ఇక వీరితోపాటు కార్తీక్ మరదలు జోత్స్న పాత్రలో గాయత్రి సింహాద్రి నటిస్తోంది. ఇక ఈమె పాత్ర మోనిత పాత్రలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది..

ఛాన్స్ మిస్ చేసుకున్న శోభా శెట్టి..

ఇప్పటికే ఈ పాత్రలు ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టాయి ఇకపోతే మోనిత పాత్రలో శోభ శెట్టి నటించాల్సి ఉండగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొని అక్కడ నెగెటివిటీని మూటగట్టుకోవడంతో ఈ సీరియల్ లో ఈమెకు అవకాశం లభించలేదని తెలుస్తోంది. అంతేకాదు ఈ సీరియల్ నుంచి ఆమెను తీసేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం బిగ్ బాస్ అని పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా శోభా శెట్టి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

బుల్లితెర పై సీరియల్స్ హవా..

ఇకపోతే కార్తీకదీపం సీరియల్ అటు ఆడియన్స్ను ఏ రేంజ్ లో మెప్పించిందో అందరికీ తెలుసు.. మరి ఈ కార్తీకదీపం నవ వసంతం సీరియల్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుంది.. ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుంది అనేది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా ఈ సీరియల్ పరంపర కొనసాగడం అభిమానులకు మంచి ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.. మొత్తానికైతే బుల్లితెర సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండగా ఇప్పుడు ఈ సీరియల్ మరొకసారి అలరించడానికి సిద్ధమయ్యింది..

సీరియల్ కి సీక్వెల్..

సాధారణంగా సినిమాలలో మాత్రమే మనం సీక్వెల్స్ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ సీరియల్ కి సీక్వెల్ రావడం అంటే మామూలు విషయం కాదు.. మరి సీరియల్ కె సీక్వెల్ దింపారంటే ఇక ఈ సీక్వల్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు