Ayodhya Ram Mandir: అయోధ్యలో అలా మాట్లాడాల్సింది కాదు… రజినీని తప్పుపట్టిన కబాలి డైరెక్టర్..!

సూపర్ స్టార్ రజినీకాంత్… సౌత్ ఇండస్ట్రీలో చాలా మందికి ఓ రోల్ మోడల్. 73 ఏళ్లు వచ్చినా, కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నాడు. ఇదే సమయంలో రాజకీయంగా కూడా చాలా మంది పొలిటిషన్స్‌తో రజినీ క్లోజ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ కు అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వనం వచ్చింది.

సోమవారం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చాలా గ్రాండ్ గా కూడా జరిగింది. దీని తర్వాత రజినీకాంత్… అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ప్రారంభోత్సవం చారిత్రాత్మకమని, 500 ఏళ్ల నాటి సమస్య ఈ రోజు పరిష్కారమైంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను డైరెక్టర్ పా. రంజిత్ తప్పుబట్టాడు.

తమిళ ఇండస్ట్రీలో పా. రంజిత్ – రజినీకాంత్ మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు కబాలి, కలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా, రజినీకాంత్ లుక్ అయితే ఫ్యాన్స్ అందరికీ నచ్చింది. సూపర్ స్టార్ ఎలా కనపడాలి అని అనుకున్నారో… అలా ఈ రెండు సినిమాల్లో ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత రంజిత్ – రజినీ మధ్య మరిన్ని సినిమాలు కూడా వస్తాయని టాక్ వచ్చింది.

- Advertisement -

అయితే ప్రస్తుతం రజినీకాంత్ పై పా. రంజిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయోధ్యకు వెళ్లడం, రాముడి దర్శనం చేసుకోవడం పూర్తిగా రజిని వ్యక్తిగతమని అన్నారు. కానీ, 500 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది అంటూ వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం సరైనది కాదు అంటూ విమర్శించాడు. నేడు ఇళ్ల ముందు దీపాలు వెలగించని వాళ్లను ఉగ్రవాదులుగా చూస్తున్నారని, ఇలాంటి రాజకీయాల నుంచి విముక్తి రావాలి అంటూ రంజిత్ కామెంట్స్ చేశాడు.

అయితే రంజిత్ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో వేడిని పుట్టించాయి. ఈ కామెంట్స్ తర్వాత రంజిత్‌ను రజినీకాంత్ ఫ్యాన్స్, ఓ వర్గం నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు