Samantha : శాకుంతలం సినిమా వల్ల దిల్ రాజు నష్టపోయింది ఎంతో తెల్సా !

సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ప్రేక్షకులని ఎంతగా నిరాశపరిచిందో చెప్పనక్కర్లేదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ఆయన కూతురు నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. దిల్ రాజు ఈ సినిమా ఎక్క్యూటివ్ నిర్మాతగా సినిమాని ప్రెసెంట్ చేసారు.

కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా గుణ శేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ ఈ సినిమాలో సమంతకి జోడిగా నటించాడు. 80 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రీమియర్ షో కి రెస్పాన్స్ పాజిటివ్ గా వచ్చేసరికి సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ప్రమోషన్స్ కూడా మూవీ టీమ్ గట్టిగానే చేసింది. సమంత ఆనారోగ్యాంగా ఉన్నాకూడా సినిమా రిలీజ్ ని మైండ్ పెట్టుకొని ప్రతిచోటా ప్రమోషన్స్ లో పాల్గొంది. కానీ మొదటి ఆట పడగానే శాకుంతలం వ్యవహారం బయట పడింది. మూవీ టీం చేసిన ప్రమోషన్స్ అన్ని థియేటర్ వరకు ఐతే రప్పించగలిగాయి కానీ..సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద శాకుంతలం హ్యూజ్ డిజాస్టర్ నిలిచింది.

ఐతే సినిమాకి ముందు శాకుంతలం గురించి గొప్పగా ప్రమోట్ చేసిన మూవీ టీం సినిమా రిజల్ట్ తేడా కొట్టేసరికి ఎవరు బయటికి రాలేదు. సమంత  శాకుంతలం సినిమా రిలీజ్ తరువాత సిటడెల్ వెబ్ సిరీస్ లో బిజీ అయిపొయింది. మరో పక్క దిల్ రాజు, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న గేమ్ చేంజర్ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. అయితే ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ పాల్గొన్న దిల్ రాజు శాకుంతలం సినిమా వల్ల తాను నష్టపోయిన మొత్తాన్ని బయట పెట్టాడు. తన ఇన్ని సంవత్సరాల కెరీర్ లో శాకుంతలం సినిమా అతి పెద్ద జర్క్ ఇచ్చిందని చెబుతూ శాకుంతలం సినిమా వల్ల తాను 22 కోట్లు నష్టపోయాను అని చెప్పుకొచ్చారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు