Chiranjeevi : పుత్రోత్సాహం

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. ఇటీవ‌లే ఆచార్య సినిమా నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ గాడ్ ఫాద‌ర్‌, వాల్తేరు వీర‌య్య‌, భోలో శంక‌ర్ వంటి సినిమాలు చేస్తున్నారు. ఇవాళ అనంత‌పురంలో గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌కి చిరంజీవి ఎప్పుడు వ‌స్తాడా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ త‌రుణంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తన కుమారుడు ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఓ ట్వీట్ చేశాడు. మెగా ప‌వ‌ర్ స్టార్ కెరీర్‌లోనే కాకుండా అభిమానుల్లో కూడా ఓ ప్ర‌త్యేక‌మైన రోజుగా ఈ రోజు మారింది. చ‌ర‌ణ్‌ పాన్ ఇండియా లెవ‌ల్‌లో కాదు.. గోబ‌ల్‌గా కూడా సెన్షేష‌న‌ల్‌రీచ్‌ని సొంతం చేసుకున్నాడు. మ‌రోవైపు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు సంబురాలు జ‌రుపుకున్నారు.

రాంచ‌ర‌ణ్ 15 ఏళ్ల ప్ర‌స్తానంపై చిరంజీవి మాట్లాడుతూ.. ఒక న‌టుడిగా చ‌ర‌ణ్ చిరుత నుంచి, మ‌గ‌ధీర‌, రంగ‌స్థ‌లం, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 15వ సినిమా చేసే స్థాయికి త‌న‌ను తాను మార్చుకుంటూ వ‌చ్చాడు. ముఖ్యంగా త‌న వ‌ర్క్‌, డెడికేష‌న్‌, అన్నీ చూసి గ‌ర్విస్తున్నాన‌ని చ‌ర‌ణ్ ఉన్న‌త శిఖ‌రాలు అందుకోవాలి. నువ్వు సాధిస్తావ‌ని మెగాస్టార్ ఒక ఫ్రైడ్ పాథ‌ర్ గా త‌న గ‌ర్వాన్ని వ్య‌క్తం చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పోస్ట్ మెగాఫ్యాన్స్‌లో మంచి ఊపు తీసుకొచ్చింద‌నే చెప్పాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు