Pawan kalyan: 10 నిమిషాల్లో బ్రో స్టోరీ నే మార్చేశాడు త్రివిక్రమ్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ సినిమా బ్రో. తమిళ్ యాక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచన సహకారం అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణతర కార్యక్రమాలు ముగించుకొని ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మూవీ యూనిట్.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ ఉండటం వల్ల ఆయన సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నాడు. పవన్ మినహా బ్రో సినిమాకు పని చేసిన ఇతర తారాగణం అందరు సినిమాను ప్రమోట్ చేసే కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవలనే హీరోయిన్ కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు పలు టివి చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బ్రో సినిమా షూటింగ్ విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఇక లేటెస్ట్ గా డైరెక్టర్ సముద్రఖని కూడా బ్రో ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

బ్రో సినిమా తెలుగులో చేయడానికి త్రివిక్రమే ప్రధాన కారణం అని ఆయన చెబుతూ, ధనుష్ సార్ సినిమా షూటింగ్ సమయంలో సముద్రఖని, త్రివిక్రమ్ వినోదాయ సీతాం సినిమా గురించి మాట్లాడుకున్నమని, అయితే సముద్రఖని వినోదాయ సీతాం కథను త్రివిక్రమ్ కు చెప్పగానే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి, ఈ సినిమాను తెలుగులో చేద్దాం కానీ కథ ఇలా మార్చాలి అని అన్నారట కేవలం పది నిమిషాల్లోనే సినిమా స్క్రీన్ ప్లే అంత మార్చేసాడట త్రివిక్రమ్, ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను కూడా ఈ సినిమా చేయడానికి ఆయనే ఒప్పించాడట. దాంతో ఈ బ్రో సినిమా స్టార్ట్ అయిందని సముద్రఖని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు