జబర్దస్త్ షోతో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ, నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయన ” సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడంతో అనసూయకి వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన “రంగస్థలం” సినిమాతో అనసూయ కెరీర్ టర్న్ తీసుకుంది. రంగమ్మత్త పాత్రలో అనసూయ పర్ఫామెన్స్ కి గాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు కూడా వచ్చింది.
ఇక విషయానికొస్తే అనసూయ విజయ్ దేవరకొండకి మధ్య గొడవ ఇప్పటిది కాదు. ఇది అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఉంది. 2017 లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎన్ని వివాదాలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు. బూతులు,రొమాంటిక్ సీన్స్, డ్రగ్స్ సీన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా సినిమా అప్పట్లో చాలా వివాదాల మధ్య నడుమ రిలీజ్ అయింది. అయితే ఈ వివాదాలన్నిటిని మించి అర్జున్ రెడ్డి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడిన స్పీచ్ తో వివాదాలు ఇంకా తార స్థాయికి వెళ్లాయి.
అర్జున్ రెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. అప్పటిదాకా రిలీజ్ ఈవెంట్ లలో హీరోలు మంచి సినిమా తీసాము..మా సినిమా చూడండి అంటూ అడిగేవారు, అయితే విజయ్ వీటికి భిన్నంగా కొన్ని వివాస్పద వ్యాఖ్యలు చేసాడు. సినిమాలో ఉండే ఒక బూతు డైలాగ్ ని స్టూడెంట్స్ అందరితో చెప్పించాడు. అయితే ఇలా చెప్పించడం వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అప్పుడే యాంకర్ అనసూయ ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ఈ విషయమై చర్చించాలి అంటూ నానా హడావిడి చేసింది. ఆడవాళ్ళని తిడుతూ విజయ దేవరకొండ స్టేజి పైన అలా ఎలా మాట్లాడతాడని దీనిపై అందరు స్పందించాలంటూ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసింది. అయితే అనసూయ అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తుందంటూ ఎవరు ఈమెకి సపోర్ట్ చేయలేదు. ఆ తరువాత సినిమా రిలీజై సూపర్ హిట్ అవడంతో ఎవరు నోరు మెదపలేదు.
ఆ తరువాత కూడా అనసూయ విజయ్ ని , విజయ్ సినిమాలని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టేది. కానీ ఎవరు పట్టించుకోలేదు పైగా బూతులుండే జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తూ, సినిమాలలో ఎక్సపోసింగ్ చేసే నీకు మాట్లాడే అర్హత లేదంటూ ఆమె వ్యాఖ్యలని కొట్టిపారేసేవారు. కానీ ఎంత మంది ఎన్ని రకాలుగా మాట్లాడిన అనసూయ పద్దతిలో మార్పు అయితే రాలేదనే చెప్పాలి.
లేటెస్ట్ గా ఆమె విజయ్ ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో మరో పోస్ట్ పెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా “ఖుషి “ ఈ సినిమాలో సమంత విజయ్ కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమాకి సంబందించి మొదటి పాటని ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం ఎనౌన్స్ చేసింది. అయితే మరి ఇందులో అనసూయకి ఎం తప్పు కనిపించిందో ఏమో కానీ “ఇప్పుడే ఒకటి చూసాను బాబోయ్ పైత్యం ఎం చేస్తాం అంటకుండా చూసుకుందాం” అంటూ ట్వీట్ చేసింది. అయితే ఖుషి సినిమా పోస్టర్స్ లో ది విజయ్ దేవరకొండ అని పేరు పెట్టడమే ఇందుకు కారణమంట, సమంత పేరు నార్మల్ ఉండి , విజయ్ కి మాత్రం ది అని ఎందుకు ఉండాలి అనే భావాన్ని ఆమె వ్యక్త పరిచింది. అనసూయ కామెంట్స్ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వని విజయ్ మరి దీనిపైన స్పందిస్తాడో లేక ఎప్పటిలాగే పట్టనట్టు వదిలేస్తాడో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023