Balayya : అభిమానితో నందమూరి “విందు”

నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ పేరు చెబితే అభిమానులకు పూనకాలే. అభిమానులకు బాలకృష్ణ చాలా దగ్గరగా ఉంటారు. అభిమానుల తీరుపై అప్పుడప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. అంతకు రెట్టింపు ప్రేమను కూడా చూపిస్తారని టాక్. అయితే తాజాగా బాలయ్య చేసిన పనికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న NBK 107 చిత్రం షూటింగ్ కర్నూలులో జరుపుకుంటుంది.అయితే అక్కడ ఒక సామాన్య అభిమానిని గుర్తు పెట్టుకున్న బాలయ్య, ఫోన్ చేసి మరి తన దగ్గరకు పిలిపించుకున్నారు. అంతేకాదు అభిమాని కుటుంబంతో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జై బాలయ్య అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ అభిమాని ఎవరంటే ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు ఎన్ సజ్జాద్ హుస్సేన్.

తమ అభిమాన హీరో బాలయ్య తో కలిసి భోజనం చేయడంతో హుస్సేన్ ఫ్యామిలీ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇటీవల అఖండ వంటి భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కర్నూలులో శరవేగంగా జరుగుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన బాలయ్య పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు