Prabhas :ఆదిపురుష్ టీం చేసిన ఈ పనికి మెచ్చుకోకుండ ఉండలేరు..

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.ఈ సందర్బంగా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మూవీ యూనిట్.

ఆదిపురుష్ సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుండటంతో, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూన్ 6న తిరుపతిలో భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు.  అయితే ఆదిపురుష్  పాన్ ఇండియా సినిమా అయిన తెలుగు రాష్టాలలోనే లోనే ఈ ఈవెంట్ నిర్వహించడానికి కారణం లేకపోలేదు.. ప్రభాస్ కి ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే తాను చేసిన ఏ సినిమానైనా షూటింగ్ ఎక్కడ మొదలు పెట్టిన, పెద్దగా పట్టించుకోని ప్రభాస్.. ప్రమోషన్స్ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ (తెలుగు రాష్టాలలో)లోనే మొదలు పెట్టాలనే షరతు పెడతాడంట. ఇది ఎప్పటి నుంచే ప్రభాస్ సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నాడు. అందుకే గతంలో రిలీజ్ చేసిన ఆదిపురుష్ సినిమా టీజర్, ట్రైలర్ లు హైదరాబాద్ లో మొదటగా రిలీజ్ చేసిన తరువాతనే మిగితా సిటీస్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

ఇక అసలు విషయనిస్తే రామాయణ పారాయణం చేసిన ప్రతి చోట హనుమంతుడు అక్కడ కొలువు ధీరతాడని హిందువులకి నమ్మకం. అందుకే రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ ఆదిపురుష్ సినిమా చూసిన కూడా రామాయణ పారాయణం చేసినట్టే అనే ఉద్దేశ్యంతో మూవీ టీం థియేటర్లన్నిటిలో హనుమంతుడి కోసం ఒక సీట్ ని విక్రయించకుండ ఉంచబోతున్నారట. అయితే గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టి, పురాణాలకి గౌరవం ఇవ్వడంతో ఆదిపురుష్ టీం ని సోషల్ మీడియాలో అందరు అభినందిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు